మార్చి 1న 'ప్రపంచ సీగ్రాస్ డే'
- March 01, 2023
మస్కట్: మార్చి 1ని 'వరల్డ్ సీగ్రాస్ డే'గా ప్రకటిస్తూ శ్రీలంక సమర్పించిన తీర్మానాన్ని యూఎన్ జనరల్ అసెంబ్లీ మే 23, 2022న ఆమోదించింది. తీ తీర్మానానికి 24 ఇతర సభ్య దేశాలు సహ-స్పాన్సర్ చేశాయి. దీని ప్రకారం మార్చి 1న ప్రపంచం మొట్టమొదటి 'వరల్డ్ సీగ్రాస్ డే'గా జరుపుకోనున్నారు.
159 దేశాలు, ఆరు ఖండాలలో సుమారు 300,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సముద్రపు గడ్డి భూమిపై అత్యంత విలువైన సముద్ర పర్యావరణ వ్యవస్థలలో ఒకటి. సముద్రపు గడ్డి అపారమైన కార్బన్ సీక్వెస్ట్రేషన్ సంభావ్యత కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోని సముద్రపు కార్బన్లో 18 శాతం వరకు నిల్వ చేసుకుంటుంది. ఇది వర్షారణ్యాల కంటే ఎక్కువ. సముద్రపు అడుగుభాగాన్ని స్థిరీకరించడంలో సాయం చేస్తుంది. వాణిజ్య, వినోద చేపల జాతులు అలాగే తాబేళ్లు, దుగాంగ్లు, మనాటీలు వంటి అంతరించిపోతున్న, ఆకర్షణీయమైన జాతులతో సహా అనేక సముద్ర జీవులకు ఆహారం, ఆశ్రయం కల్పించడం ద్వారా పర్యావరణ వ్యవస్థ మద్దతును అందించడంలో సముద్రపు గడ్డి(సీగ్రాస్) ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.
ఇంతటి ప్రాముఖ్యత కలిగిఉన్న సముద్రపు గడ్డి పర్యావరణ వ్యవస్థలు మానవ కార్యకలాపాల ఫలితంగా నాశనమవుతున్నాయి. ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా 7 శాతం సముద్రపు గడ్డి సముద్రపు ఆవాసాలు కోల్పోతున్నాయి. ప్రతి 30 నిమిషాలకు ఒక ఫుట్బాల్ మైదానం అంత సమద్రపు గడ్డి నాశనం అవుతోందని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ పబ్లికేషన్ 'అవుట్ ఆఫ్ ది బ్లూ: ది వాల్యూ ఆఫ్ సీగ్రాసెస్ టు ది ఎన్విరాన్మెంట్ అండ్ టు పీపుల్' తన ప్రకటనలో పేర్కొంది. ఒమన్ సుల్తానేట్లోని శ్రీలంక రాయబార కార్యాలయం కూడా మస్కట్-ఒమన్లో ఈ ముఖ్యమైన రోజును ప్రత్యేక అవగాహన కార్యక్రమంతో నిర్వహించేందుకు ప్రాణాళికలు రూపొందించింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







