91 మిలియన్ దిర్హాంల విలువైన నకిలీ దుస్తులు సీజ్
- March 01, 2023
యూఏఈ: రస్ అల్ ఖైమా అధికారులు ఒక గిడ్డంగి నుండి 91 మిలియన్ దిర్హాంల విలువైన 214,000 నకిలీ దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. 28 అంతర్జాతీయ బ్రాండ్ల లోగోలను కలిగి ఉన్న నకిలీ దుస్తులు ఉన్నాయని, రస్ అల్ ఖైమా (RAK-DED)లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ తెలిపింది. మోసానికి పాల్పడుతున్న కంపెనీ రస్ అల్ ఖైమా బయట స్థాపిత కంపెనీ అని, ఎమిరేట్లోని పాడుబడిన గిడ్డంగులలో వస్తువులను నిల్వ చేయడం ద్వారా తన వ్యాపారాన్ని నిర్వహిస్తుందని తమ నివేదికలో అధికారులు పేర్కొన్నారు. రస్ అల్ ఖైమా పోలీస్లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్తో సమన్వయంతో గోడాన్ లపై దాడులు చేసి, రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న నకిలీ దుస్తులు, వస్తువులు, వాహనాలను జప్తు చేసినట్లు కమర్షియల్ కంట్రోల్ అండ్ ప్రొటెక్షన్ విభాగం డైరెక్టర్ ఫైసల్ అల్యూన్ తెలిపారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించారు. నకిలీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల కలిగే నష్టాల గురించి డైరెక్టర్ ఫైసల్ అల్యూన్ ప్రజలను హెచ్చరించారు. నకిలీ ఉత్పత్తుల వాడకంతో సదరు వ్యక్తుల ఆరోగ్యం, భద్రతకు హాని కలుగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







