91 మిలియన్ దిర్హాంల విలువైన నకిలీ దుస్తులు సీజ్
- March 01, 2023
యూఏఈ: రస్ అల్ ఖైమా అధికారులు ఒక గిడ్డంగి నుండి 91 మిలియన్ దిర్హాంల విలువైన 214,000 నకిలీ దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. 28 అంతర్జాతీయ బ్రాండ్ల లోగోలను కలిగి ఉన్న నకిలీ దుస్తులు ఉన్నాయని, రస్ అల్ ఖైమా (RAK-DED)లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ తెలిపింది. మోసానికి పాల్పడుతున్న కంపెనీ రస్ అల్ ఖైమా బయట స్థాపిత కంపెనీ అని, ఎమిరేట్లోని పాడుబడిన గిడ్డంగులలో వస్తువులను నిల్వ చేయడం ద్వారా తన వ్యాపారాన్ని నిర్వహిస్తుందని తమ నివేదికలో అధికారులు పేర్కొన్నారు. రస్ అల్ ఖైమా పోలీస్లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్తో సమన్వయంతో గోడాన్ లపై దాడులు చేసి, రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న నకిలీ దుస్తులు, వస్తువులు, వాహనాలను జప్తు చేసినట్లు కమర్షియల్ కంట్రోల్ అండ్ ప్రొటెక్షన్ విభాగం డైరెక్టర్ ఫైసల్ అల్యూన్ తెలిపారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించారు. నకిలీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల కలిగే నష్టాల గురించి డైరెక్టర్ ఫైసల్ అల్యూన్ ప్రజలను హెచ్చరించారు. నకిలీ ఉత్పత్తుల వాడకంతో సదరు వ్యక్తుల ఆరోగ్యం, భద్రతకు హాని కలుగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!







