యూఏఈ వీసా నిబంధనల్లో మార్పులు: ఇకపై బంధువుల స్పాన్సర్కు కనీస జీతం Dh10,000
- March 01, 2023
యూఏఈ: నివాస వీసా నియమాలలో యూఏఈ మార్పులు చేసింది. నివాస వీసాపై ఐదుగురు బంధువులను స్పాన్సర్ చేయాలనుకునే యూఏఈ ప్రవాసులు తప్పనిసరిగా కనీస నెలవారీ జీతం Dh10,000 కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అక్టోబరు 3, 2022న అమలు చేయబడిన కేబినెట్ తీర్మానం నెం. 65 షరతులు, నియంత్రణలకు సంబంధించి ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ చైర్మన్ అలీ మొహమ్మద్ అల్ షమ్సీ ఈ మేరకు ఒక తీర్మానాన్ని విడుదల చేశారు. అదే విధంగా ప్రవాస స్పాన్సర్లు బంధువుల నివాసానికి తగిన గృహాలను కలిగి ఉండాలి. ఆరుగురు బంధువులను స్పాన్సర్ చేయాలనుకుంటున్న వారికి కనీసం Dh15,000 కంటే ఎక్కువ జీతం ఉండాలి. డైరెక్టర్ జనరల్ 6 కంటే ఎక్కువ మంది బంధువుల స్పాన్సర్ కోసం వచ్చిన దరఖాస్తులను సమీక్షిస్తారని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







