యూఏఈ వీసా నిబంధనల్లో మార్పులు: ఇకపై బంధువుల స్పాన్సర్కు కనీస జీతం Dh10,000
- March 01, 2023
యూఏఈ: నివాస వీసా నియమాలలో యూఏఈ మార్పులు చేసింది. నివాస వీసాపై ఐదుగురు బంధువులను స్పాన్సర్ చేయాలనుకునే యూఏఈ ప్రవాసులు తప్పనిసరిగా కనీస నెలవారీ జీతం Dh10,000 కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అక్టోబరు 3, 2022న అమలు చేయబడిన కేబినెట్ తీర్మానం నెం. 65 షరతులు, నియంత్రణలకు సంబంధించి ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ చైర్మన్ అలీ మొహమ్మద్ అల్ షమ్సీ ఈ మేరకు ఒక తీర్మానాన్ని విడుదల చేశారు. అదే విధంగా ప్రవాస స్పాన్సర్లు బంధువుల నివాసానికి తగిన గృహాలను కలిగి ఉండాలి. ఆరుగురు బంధువులను స్పాన్సర్ చేయాలనుకుంటున్న వారికి కనీసం Dh15,000 కంటే ఎక్కువ జీతం ఉండాలి. డైరెక్టర్ జనరల్ 6 కంటే ఎక్కువ మంది బంధువుల స్పాన్సర్ కోసం వచ్చిన దరఖాస్తులను సమీక్షిస్తారని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







