యూఏఈ వీసా నిబంధనల్లో మార్పులు: ఇకపై బంధువుల స్పాన్సర్కు కనీస జీతం Dh10,000
- March 01, 2023
యూఏఈ: నివాస వీసా నియమాలలో యూఏఈ మార్పులు చేసింది. నివాస వీసాపై ఐదుగురు బంధువులను స్పాన్సర్ చేయాలనుకునే యూఏఈ ప్రవాసులు తప్పనిసరిగా కనీస నెలవారీ జీతం Dh10,000 కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అక్టోబరు 3, 2022న అమలు చేయబడిన కేబినెట్ తీర్మానం నెం. 65 షరతులు, నియంత్రణలకు సంబంధించి ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ చైర్మన్ అలీ మొహమ్మద్ అల్ షమ్సీ ఈ మేరకు ఒక తీర్మానాన్ని విడుదల చేశారు. అదే విధంగా ప్రవాస స్పాన్సర్లు బంధువుల నివాసానికి తగిన గృహాలను కలిగి ఉండాలి. ఆరుగురు బంధువులను స్పాన్సర్ చేయాలనుకుంటున్న వారికి కనీసం Dh15,000 కంటే ఎక్కువ జీతం ఉండాలి. డైరెక్టర్ జనరల్ 6 కంటే ఎక్కువ మంది బంధువుల స్పాన్సర్ కోసం వచ్చిన దరఖాస్తులను సమీక్షిస్తారని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







