ట్రాఫిక్ ప్రమాదాల్లో 322 మంది మృతి
- March 02, 2023
కువైట్: 2022లో కువైట్ వ్యాప్తంగా జరిగిన వివిధ ట్రాఫిక్ ప్రమాదాల్లో మొత్తం 322 మంది మరణించారని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ యూసఫ్ అల్-ఖద్దా తెలిపారు. 2021 సంవత్సరంలో ట్రాఫిక్ ప్రమాదం కారణంగా మరణించిన వారి సంఖ్య 323గా ఉందన్నారు. 2022 సంవత్సరంలో డైరెక్ట్ ఉల్లంఘనల సంఖ్య 1,384,842 కాగా, పరోక్ష ఉల్లంఘనలు 2,852,612 ఉన్నాయి. ఇక్కడ స్పీడ్ కు సంబంధించిన ఉల్లంఘనల సంఖ్య 2,653,005, ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య 236,294గా ఉందని తెలిపారు. ఏడాది కాలంలో వివిధ కారణాలతో మొత్తం 5,076 కార్లు, 798 మోటార్సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ చెప్పారు. 2022 సంవత్సరంలో ట్రాఫిక్ ప్రమాదాల సంఖ్య 68,770గా ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







