ట్రాఫిక్ ప్రమాదాల్లో 322 మంది మృతి

- March 02, 2023 , by Maagulf
ట్రాఫిక్ ప్రమాదాల్లో 322 మంది మృతి

కువైట్: 2022లో కువైట్ వ్యాప్తంగా జరిగిన వివిధ ట్రాఫిక్ ప్రమాదాల్లో మొత్తం 322 మంది మరణించారని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ యూసఫ్ అల్-ఖద్దా తెలిపారు. 2021 సంవత్సరంలో ట్రాఫిక్ ప్రమాదం కారణంగా మరణించిన వారి సంఖ్య 323గా ఉందన్నారు. 2022 సంవత్సరంలో డైరెక్ట్ ఉల్లంఘనల సంఖ్య 1,384,842 కాగా, పరోక్ష ఉల్లంఘనలు 2,852,612 ఉన్నాయి. ఇక్కడ స్పీడ్ కు సంబంధించిన ఉల్లంఘనల సంఖ్య 2,653,005, ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య 236,294గా ఉందని తెలిపారు. ఏడాది కాలంలో వివిధ కారణాలతో మొత్తం 5,076 కార్లు, 798 మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ చెప్పారు. 2022 సంవత్సరంలో ట్రాఫిక్ ప్రమాదాల సంఖ్య 68,770గా ఉందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com