ట్రాఫిక్ ప్రమాదాల్లో 322 మంది మృతి
- March 02, 2023కువైట్: 2022లో కువైట్ వ్యాప్తంగా జరిగిన వివిధ ట్రాఫిక్ ప్రమాదాల్లో మొత్తం 322 మంది మరణించారని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ యూసఫ్ అల్-ఖద్దా తెలిపారు. 2021 సంవత్సరంలో ట్రాఫిక్ ప్రమాదం కారణంగా మరణించిన వారి సంఖ్య 323గా ఉందన్నారు. 2022 సంవత్సరంలో డైరెక్ట్ ఉల్లంఘనల సంఖ్య 1,384,842 కాగా, పరోక్ష ఉల్లంఘనలు 2,852,612 ఉన్నాయి. ఇక్కడ స్పీడ్ కు సంబంధించిన ఉల్లంఘనల సంఖ్య 2,653,005, ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య 236,294గా ఉందని తెలిపారు. ఏడాది కాలంలో వివిధ కారణాలతో మొత్తం 5,076 కార్లు, 798 మోటార్సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ చెప్పారు. 2022 సంవత్సరంలో ట్రాఫిక్ ప్రమాదాల సంఖ్య 68,770గా ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..