ట్రాఫిక్ ప్రమాదాల్లో 322 మంది మృతి
- March 02, 2023
కువైట్: 2022లో కువైట్ వ్యాప్తంగా జరిగిన వివిధ ట్రాఫిక్ ప్రమాదాల్లో మొత్తం 322 మంది మరణించారని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ యూసఫ్ అల్-ఖద్దా తెలిపారు. 2021 సంవత్సరంలో ట్రాఫిక్ ప్రమాదం కారణంగా మరణించిన వారి సంఖ్య 323గా ఉందన్నారు. 2022 సంవత్సరంలో డైరెక్ట్ ఉల్లంఘనల సంఖ్య 1,384,842 కాగా, పరోక్ష ఉల్లంఘనలు 2,852,612 ఉన్నాయి. ఇక్కడ స్పీడ్ కు సంబంధించిన ఉల్లంఘనల సంఖ్య 2,653,005, ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య 236,294గా ఉందని తెలిపారు. ఏడాది కాలంలో వివిధ కారణాలతో మొత్తం 5,076 కార్లు, 798 మోటార్సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ చెప్పారు. 2022 సంవత్సరంలో ట్రాఫిక్ ప్రమాదాల సంఖ్య 68,770గా ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









