రమదాన్: మక్కా, మదీనా మధ్య 100 రైలు సర్వీసులు
- March 03, 2023
జెడ్డా : పవిత్ర రమదాన్ మాసంలో పీక్ సీజన్లో మక్కా, మదీనా మధ్య రైలు సర్వీసుల సంఖ్యను రోజుకు 100 కంటే ఎక్కువ ట్రిప్పులకు పెంచాలని నిర్ణయించినట్లు హరమైన్ హై-స్పీడ్ రైల్వే పేర్కొంది. రమదాన్, ఉమ్రా సీజన్ నేపథ్యంలో కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జెడ్డా, మదీనాలోని ప్రిన్స్ ముహమ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా సౌదీ అరేబియాకు ఉమ్రా యాత్రికులు, సందర్శకులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే మేనేజ్మెంట్ వర్గాలు తెలిపాయి. హరమైన్ హై-స్పీడ్ రైలులో ఉమ్రా యాత్రికులు, పవిత్ర నగరాలైన మక్కా- మదీనాలకు.. అలాగే జెడ్డా నగరం, కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీ ఆఫ్ రాబిగ్కు సందర్శకులు భారీ సంఖ్యలో వస్తున్నారని.. మక్కా, మదీనాలను జెడ్డా, రబీగ్ మీదుగా కలిపే ఈ రైల్వే లైను ద్వారా ఇప్పటివరకు 25,000 కంటే ఎక్కువ సర్వీసులను నడిపంచినట్లు హరమైన్ హై-స్పీడ్ రైల్వే పేర్కొంది. సులేమానియాలోని జెడ్డా స్టేషన్లో ప్రయాణాల సంఖ్య పెరిగినట్లు తెలిపింది. ప్రస్తుతం మక్కా, జెద్దా సులేమానియా మధ్య 58 ట్రిప్పులు నడుస్తున్నాయని, అలాగే సులేమానియా స్టేషన్, కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య 26 ట్రిప్పులు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. రద్దీ సమయాల్లో మక్కా, మదీనా మధ్య గంటకు రెండు ట్రిప్పులు.. రద్దీ సమయాల్లో కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టేషన్, మక్కా స్టేషన్ మధ్య ప్రతి గంటకు ఒక ట్రిప్పు ఉంటుందని హరమైన్ హై-స్పీడ్ రైల్వే తెలిపింది.
తాజా వార్తలు
- అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!







