రమదాన్: మక్కా, మదీనా మధ్య 100 రైలు సర్వీసులు
- March 03, 2023
జెడ్డా : పవిత్ర రమదాన్ మాసంలో పీక్ సీజన్లో మక్కా, మదీనా మధ్య రైలు సర్వీసుల సంఖ్యను రోజుకు 100 కంటే ఎక్కువ ట్రిప్పులకు పెంచాలని నిర్ణయించినట్లు హరమైన్ హై-స్పీడ్ రైల్వే పేర్కొంది. రమదాన్, ఉమ్రా సీజన్ నేపథ్యంలో కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జెడ్డా, మదీనాలోని ప్రిన్స్ ముహమ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా సౌదీ అరేబియాకు ఉమ్రా యాత్రికులు, సందర్శకులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే మేనేజ్మెంట్ వర్గాలు తెలిపాయి. హరమైన్ హై-స్పీడ్ రైలులో ఉమ్రా యాత్రికులు, పవిత్ర నగరాలైన మక్కా- మదీనాలకు.. అలాగే జెడ్డా నగరం, కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీ ఆఫ్ రాబిగ్కు సందర్శకులు భారీ సంఖ్యలో వస్తున్నారని.. మక్కా, మదీనాలను జెడ్డా, రబీగ్ మీదుగా కలిపే ఈ రైల్వే లైను ద్వారా ఇప్పటివరకు 25,000 కంటే ఎక్కువ సర్వీసులను నడిపంచినట్లు హరమైన్ హై-స్పీడ్ రైల్వే పేర్కొంది. సులేమానియాలోని జెడ్డా స్టేషన్లో ప్రయాణాల సంఖ్య పెరిగినట్లు తెలిపింది. ప్రస్తుతం మక్కా, జెద్దా సులేమానియా మధ్య 58 ట్రిప్పులు నడుస్తున్నాయని, అలాగే సులేమానియా స్టేషన్, కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య 26 ట్రిప్పులు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. రద్దీ సమయాల్లో మక్కా, మదీనా మధ్య గంటకు రెండు ట్రిప్పులు.. రద్దీ సమయాల్లో కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టేషన్, మక్కా స్టేషన్ మధ్య ప్రతి గంటకు ఒక ట్రిప్పు ఉంటుందని హరమైన్ హై-స్పీడ్ రైల్వే తెలిపింది.
తాజా వార్తలు
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..







