పసందైన మిక్స్డ్ ఫ్రూట్ రైతా
- June 19, 2015
పసందైన మిక్స్డ్ ఫ్రూట్ రైతా
కావలిసినవి
పెరుగు - 2 కప్పులు
అరటి పండు ముక్కలు - 2 కప్పులు
యాపిల్ ముక్కలు - 2 కప్పులు
దానిమ్మ గింజలు - 2 కప్పులు
పైనాపిల్ ముక్కలు 2 కప్పులు
మామిడిపండు ముక్కలు 2 కప్పులు
కొత్తిమీర తురుము - కొద్దిగా
పంచదార - రుచికి సరిపడా
మిరియాల పొడి - అర టీ స్పూను
యాలకుల పొడి - అర టీ స్పూను
ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం
పెరుగులో ఉప్పు, పంచదార, మిరియాల పొడి, యాలకుల పొడి కొద్దిగా పాలు లేదా నీళ్లు పోసి బాగా గిలక్కొట్టాలి. తరువాత పైన చెప్పిన పండ్ల ముక్కలన్నీ కలిపి, చివరగా కొత్తిమీర తురుము కూడా వేసి కాసేపు ఫ్రిజ్లో పెట్టి చల్లచల్లగా సర్వ్ చేసుకోవాలి.
వేసవిలో పెరుగు తినడం చాలా అవసరం. ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసిందే. అయితే కొంత మంది పెరుగును అలాగే తినమంటే అంతగా ఇష్ట పడరు. అందుకే పెరుగును ఈ రకంగా అందిస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇష్టం లేని వాళ్లు కూడా లొట్టలేస్తూ తినడానికి అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







