విదేశీయురాలితో వివాహ నమోదుకు షరియా కోర్టు అనుమతి
- March 06, 2023
బహ్రెయిన్: 2014లో తన భార్య(విదేశీయురాలు) కుదుర్చుకున్న తన "తాత్కాలిక" వివాహాన్ని అధికారికంగా నమోదు చేయాలని ఒక వ్యక్తి చేసిన అభ్యర్థనను నాల్గవ షరియా హైకోర్టు ఆమోదించింది. ఒప్రందం ప్రకారం.. వారి వివాహ ఒప్పందం 11 సంవత్సరాలు. 2014లో ప్రారంభమై వారి ఒప్పందం 2025లో ముగుస్తుంది. అధికారిక వివాహ పత్రాన్ని జారీ చేయాలని కోర్టు తీర్పు చెప్పింది. ఆమె క్లయింట్ ప్రతివాదితో తాత్కాలిక చట్టపరమైన ఒప్పందాన్ని (ముటా) కలిగి ఉందని, ఆమె సంరక్షకుని సమ్మతితో 11 సంవత్సరాల పాటు, 200 దీనార్ల కట్నంతో ఇది ఉందని సదరు వ్యక్తి న్యాయవాది వివరించారు. విచారణ సందర్భంగా ఆ జంట కోర్టుకు హాజరయ్యారు. సమర్పించిన పత్రాల చెల్లుబాటును అంగీకరించారు. అయితే వివాహ ఒప్పందం అవసరమైన అన్ని షరతులను కలిగి ఉందని, ఇద్దరు పిల్లలు వారి తల్లిదండ్రులకు చెందినవారని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. అందువల్ల, అధికారిక వివాహ పత్రాన్ని జారీ చేయాలని.. ఇద్దరు పిల్లల వంశాన్ని అధికారకంగా నిర్ధారించాలని కోర్టు అధికారులను ఆదేశించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









