యూఏఈలో భారతీయ ప్రవాసుల హోలీ సంబురాలు
- March 06, 2023
యూఏఈ: భారతీయ ప్రవాసుల హోలీ పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. హోలీ పాటలతో రంగులు చల్లుకుంటూ.. మిఠాయిలు తినిపించుకుంటూ సందడి చేశారు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ఆదివారం అబుధాబిలోని ఖలీఫా పాక్లో జరిగిన హోలీ వేడుకలో వేలాది మంది ప్రవాసులతో కలిసి పాల్గొన్నారు. ఇండియన్ బిజినెస్ ప్రొఫెషనల్ గ్రూప్ ఇరవై ఇతర కమ్యూనిటీ సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించబడిన ఈ వేడుకల సందర్భంగా రాజధానిలోని భారతీయ ప్రవాసులు రంగుల చల్లుకుంటూ ఉత్సాహంతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారత రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ.. "హోలీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల మధ్య ఆనందం, ఐక్యతను సూచించే పండుగ. మూడు సంవత్సరాల కోవిడ్ మహమ్మారి తర్వాత భారతీయ సమాజం హోలీని జరుపుకోవడం ఇదే మొదటిసారి. ”అని అన్నారు.

భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ పండుగను 'వసంతోత్సవం'గా జరుపుకుంటారు. పండుగకు ఒక రోజు ముందు కామదహనం చేయడం ఆచారం. ఇది 'చెడుపై మంచి' విజయాన్ని సూచిస్తుంది. ఇది శీతాకాలానికి వీడ్కోలుగా కూడా పరిగణిస్తారు. హిందూ మాసం 'ఫాల్గుణ్'లో 'పూర్ణిమ' పౌర్ణమి రోజు సాయంత్రం ఈ పండుగ ప్రారంభమవుతుంది. హోలీ మొదటి రోజును 'ఛోటీ హోలీ' అని కూడా పిలుస్తారు. మరుసటి రోజు రంగులతో హోలీ జరుపుకుంటారు. ఈ పండుగ ఉల్లాసాన్ని, ఆనందాన్ని మరియు భారతీయ సోదరుల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని పెంచుతుంది.
దుబాయ్లో హోలీ వేడుకలు
దుబాయ్లో రంగుల పండుగను పురస్కరించుకుని దుబాయ్ స్పోర్ట్స్ సిటీలోని స్క్వేర్లో నిర్వహించిన హోలీ వేడుకలకు వేలాది మంది భారతీయులు తరలివచ్చారు. వేడుకల్లో 10 గంటల పాటు నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లు హోరెత్తించాయి. డీజే కన్సోల్ తోపాటు పది మందికి పైగా కళాకారులు హోలీ వేడుకల ట్రాక్ లను ప్లే చేసారు. దానితో పాటు అనేక రంగులు, ఆహారం, పానీయాలను అక్కడ ఏర్పాటు చేశారు. గత పద్నాలుగు సంవత్సరాలుగా యూఏఈలో హోలీ వేడుకలను నిర్వహిస్తున్నట్లు శిఖా అగర్వాల్ తెలిపారు. "దుబాయ్లో ఐదు వేల మందికి పైగా ప్రజలు హోలీ వేడుకలను జరుపుకుంటారు" అని శిఖా అగర్వాల్ చెప్పారు.

తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







