రమదాన్: గ్రాండ్ మస్జీదులో 12వందల ఉద్యోగుల నియామకం
- March 06, 2023
మక్కా : రాబోయే రమదాన్ సీజన్లో ప్రత్యేక ప్రార్థనలకు గ్రాండ్ మస్జీదు సిద్ధమవుతోంది. ఈ మేరకు రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చే రమదాన్ సందర్భంగా దాదాపు 12,000 మంది అర్హత కలిగిన ఉద్యోగులను నియమించినట్లు పేర్కొంది. వీరితోపాటు ప్రెసిడెన్సీ గ్రాండ్ మస్జీదు, ప్రవక్త మస్జీదులో 10 కంటే ఎక్కువ స్వచ్ఛంద రంగాలలో పనిచేసేందుకు 8,000 కంటే ఎక్కువ వాలంటీర్లను నియమిస్తామని తెలిపింది. పవిత్ర రమదాన్ మాసంలో 200,000 కంటే ఎక్కువ వాలంటీర్ గంటలను సాధించాలని ప్రణాళిక రూపొందినట్లు.. తద్వారా రెండు పవిత్ర మస్జీదులలో స్వచ్ఛంద సేవను ప్రపంచంలోని అత్యంత వ్యవస్థీకృత స్వచ్ఛంద సేవల్లో ఒకటిగా మారుతుందన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, వాహనాల సేవలను మెరుగుపరచడానికి 10,000 వాహనాలను సిద్ధం చేస్తున్నామని ప్రెసిడెన్సీ పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







