మృతుడి కుటుంబం వేసిన Dh200,000 పరిహారం దావా కొట్టివేత
- March 07, 2023
యూఏఈ: అబుధాబిలో కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబం వేసిన 200,000 దిర్హామ్ నష్టపరిహారం దావాను సివల్ కోర్టు కొట్టివేసింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్, అతని కారు బీమా సంస్థ నష్టపరిహారం ఇప్పించాలని దావాలో పేర్కొన్నారు. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ముద్దాయి అయిన డ్రైవర్ ప్రమాదవశాత్తు.. బాధితుడు నడుపుతున్న కారును ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనకు కారణమైన డ్రైవర్ కు అబుధాబి క్రిమినల్ కోర్టు 5,000 దిర్హామ్ల జరిమానా విధించింది. అలాగే మృతుడి కుటుంబానికి 200,000 దిర్హామ్ బ్లడ్ మనీ చెల్లించాలని కూడా ఆదేశించింది. అయితే, మృతుడి కుటుంబం భీమా సంస్థపై సివిల్ దావా వేసింది. తాము అనుభవించిన నైతిక, భౌతిక నష్టాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రిమినల్ కోర్టు తీర్పులో ఇప్పటికే వాదులకు బ్లడ్ మనీ లభించిందని ప్రతివాదుల తరపు న్యాయవాది వాదించారు. న్యాయబద్ధత లేని కేసును కొట్టివేయాలని అభ్యర్థించారు. అన్ని పక్షాల వాదనలు విన్న సివిల్ కోర్టు కేసును కొట్టివేసింది. ఇప్పటికే ఆ కుటుంబానికి బ్లడ్ మనీ అందజేశారని, అదే కేసులో ఫిర్యాదుదారులు నష్టపరిహారం దావా వేయడానికి వీల్లేదని న్యాయమూర్తి అన్నారు.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







