మృతుడి కుటుంబం వేసిన Dh200,000 పరిహారం దావా కొట్టివేత
- March 07, 2023
యూఏఈ: అబుధాబిలో కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబం వేసిన 200,000 దిర్హామ్ నష్టపరిహారం దావాను సివల్ కోర్టు కొట్టివేసింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్, అతని కారు బీమా సంస్థ నష్టపరిహారం ఇప్పించాలని దావాలో పేర్కొన్నారు. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ముద్దాయి అయిన డ్రైవర్ ప్రమాదవశాత్తు.. బాధితుడు నడుపుతున్న కారును ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనకు కారణమైన డ్రైవర్ కు అబుధాబి క్రిమినల్ కోర్టు 5,000 దిర్హామ్ల జరిమానా విధించింది. అలాగే మృతుడి కుటుంబానికి 200,000 దిర్హామ్ బ్లడ్ మనీ చెల్లించాలని కూడా ఆదేశించింది. అయితే, మృతుడి కుటుంబం భీమా సంస్థపై సివిల్ దావా వేసింది. తాము అనుభవించిన నైతిక, భౌతిక నష్టాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రిమినల్ కోర్టు తీర్పులో ఇప్పటికే వాదులకు బ్లడ్ మనీ లభించిందని ప్రతివాదుల తరపు న్యాయవాది వాదించారు. న్యాయబద్ధత లేని కేసును కొట్టివేయాలని అభ్యర్థించారు. అన్ని పక్షాల వాదనలు విన్న సివిల్ కోర్టు కేసును కొట్టివేసింది. ఇప్పటికే ఆ కుటుంబానికి బ్లడ్ మనీ అందజేశారని, అదే కేసులో ఫిర్యాదుదారులు నష్టపరిహారం దావా వేయడానికి వీల్లేదని న్యాయమూర్తి అన్నారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









