మృతుడి కుటుంబం వేసిన Dh200,000 పరిహారం దావా కొట్టివేత
- March 07, 2023
యూఏఈ: అబుధాబిలో కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబం వేసిన 200,000 దిర్హామ్ నష్టపరిహారం దావాను సివల్ కోర్టు కొట్టివేసింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్, అతని కారు బీమా సంస్థ నష్టపరిహారం ఇప్పించాలని దావాలో పేర్కొన్నారు. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ముద్దాయి అయిన డ్రైవర్ ప్రమాదవశాత్తు.. బాధితుడు నడుపుతున్న కారును ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనకు కారణమైన డ్రైవర్ కు అబుధాబి క్రిమినల్ కోర్టు 5,000 దిర్హామ్ల జరిమానా విధించింది. అలాగే మృతుడి కుటుంబానికి 200,000 దిర్హామ్ బ్లడ్ మనీ చెల్లించాలని కూడా ఆదేశించింది. అయితే, మృతుడి కుటుంబం భీమా సంస్థపై సివిల్ దావా వేసింది. తాము అనుభవించిన నైతిక, భౌతిక నష్టాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రిమినల్ కోర్టు తీర్పులో ఇప్పటికే వాదులకు బ్లడ్ మనీ లభించిందని ప్రతివాదుల తరపు న్యాయవాది వాదించారు. న్యాయబద్ధత లేని కేసును కొట్టివేయాలని అభ్యర్థించారు. అన్ని పక్షాల వాదనలు విన్న సివిల్ కోర్టు కేసును కొట్టివేసింది. ఇప్పటికే ఆ కుటుంబానికి బ్లడ్ మనీ అందజేశారని, అదే కేసులో ఫిర్యాదుదారులు నష్టపరిహారం దావా వేయడానికి వీల్లేదని న్యాయమూర్తి అన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







