ఇండియాలో బంగారం అమ్మకంపై ఆంక్షలు: దుబాయ్లో కొనుగోళ్లను ప్రభావితం చేస్తుందా?
- March 08, 2023
యూఏఈ: భారతదేశంలో వచ్చే నెల(1 ఏప్రిల్, 2023) నుండి హాల్మార్క్ ఆరు అంకెల కోడ్ లేకుండా బంగారు ఆభరణాల విక్రయాన్ని నిలిపివేయనున్నారు. అయితే, భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దుబాయ్ బంగారం మార్కెట్ కు ప్రయోజనం కలిగిస్తుందని, కస్టమర్లకు మరింత నాణ్యమైన బంగారం లభిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత ప్రభుత్వం ఈ కొత్త నియంత్రణను ఎమిరేట్లో బంగారం ధరలను కస్టమర్లకు మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చని చెబుతున్నారు. యూఏఈలో ఉన్న అనేక మంది ప్రవాసుల ఆందోళనను తొలగిస్తూ.. యూఏఈలోకి తీసుకువచ్చే బంగారంపై లేదా భారతదేశానికి వెళ్లే ప్రయాణికులపై హాల్మార్కింగ్ మార్పు ప్రభావం చూపదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
బఫ్లే జ్యువెలర్స్ డైరెక్టర్ చిరాగ్ వోరా మాట్లాడుతూ.. “భారతదేశంలో బంగారం హాల్మార్కింగ్ కొత్త నిబంధనలు దుబాయ్ బంగారం, ఆభరణాల మార్కెట్పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపకపోవచ్చు. ఎందుకంటే ఇది ఆదేశ స్వంత నిబంధనలు. అయితే, భారతీయ మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారాన్ని వినియోగదారులను కలిగి ఉంది. దాని నిబంధనలు లేదా డిమాండ్లో ఏదైనా మార్పు దుబాయ్తో సహా ప్రపంచ బంగారం మార్కెట్పై పరోక్ష ప్రభావాన్ని చూపుతుంది.’’ అని తెలిపారు. దుబాయ్ బంగారు వ్యాపారం, ఆభరణాల తయారీకి ప్రధాన కేంద్రంగా ఉందని, ఇది భారతదేశంతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వినియోగదారులను అందిస్తుందని చెప్పారు.
“భారతదేశంలోని కొత్త హాల్మార్కింగ్ నియమాలు బంగారం ధర పెరుగుదలకు దారితీయవచ్చు.ఎందుకంటే ఆభరణాలు ప్రమాణాలకు అనుగుణంగా కొత్త యంత్రాలు కొనాల్సి ఉంటుంది. ఇది భారతదేశంలో బంగారు వస్తువుల ధరలో స్వల్ప పెరుగుదలకు దారితీయవచ్చు.ఇది దుబాయ్ బంగారం ధరలను వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. అయితే, మొత్తం ప్రభావం గ్లోబల్ బంగారం ధరలు, మారకం ధరలు, వినియోగదారుల ప్రాధాన్యతల వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉండవచ్చు." అని చిరాగ్ వోరా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఇరాన్తో తాత్కాలిక ఒప్పందం పొడిగింపుపై ఆసక్తి లేదు: ట్రంప్
- డిగ్రీ విద్యార్థులకు ఎస్బీఐ ప్రత్యేక స్కాలర్షిప్
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా NATS వినూత్న కార్యక్రమం
- వికసిత భారత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర–పూర్వ ఉపరాష్ట్రపతి పిలుపు
- దుబాయ్ ఎయిర్పోర్టులో ఉబర్, కరీమ్ ప్రయాణికుల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్
- తెలంగాణలో సర్ ముసాయిదా విడుదల..
- తమిళనాడులో విజయ్ 100రోజుల పాలన పూర్తి..
- 2026 తొలి ఆరు నెలల్లో షేక్ జాయెద్ గ్రాండ్ మసీదుకు 31.27 లక్షల మంది సందర్శకులు
- జెడ్డాలో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్తో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ భేటీ







