ఇండియాలో బంగారం అమ్మకంపై ఆంక్షలు: దుబాయ్లో కొనుగోళ్లను ప్రభావితం చేస్తుందా?
- March 08, 2023
యూఏఈ: భారతదేశంలో వచ్చే నెల(1 ఏప్రిల్, 2023) నుండి హాల్మార్క్ ఆరు అంకెల కోడ్ లేకుండా బంగారు ఆభరణాల విక్రయాన్ని నిలిపివేయనున్నారు. అయితే, భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దుబాయ్ బంగారం మార్కెట్ కు ప్రయోజనం కలిగిస్తుందని, కస్టమర్లకు మరింత నాణ్యమైన బంగారం లభిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత ప్రభుత్వం ఈ కొత్త నియంత్రణను ఎమిరేట్లో బంగారం ధరలను కస్టమర్లకు మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చని చెబుతున్నారు. యూఏఈలో ఉన్న అనేక మంది ప్రవాసుల ఆందోళనను తొలగిస్తూ.. యూఏఈలోకి తీసుకువచ్చే బంగారంపై లేదా భారతదేశానికి వెళ్లే ప్రయాణికులపై హాల్మార్కింగ్ మార్పు ప్రభావం చూపదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
బఫ్లే జ్యువెలర్స్ డైరెక్టర్ చిరాగ్ వోరా మాట్లాడుతూ.. “భారతదేశంలో బంగారం హాల్మార్కింగ్ కొత్త నిబంధనలు దుబాయ్ బంగారం, ఆభరణాల మార్కెట్పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపకపోవచ్చు. ఎందుకంటే ఇది ఆదేశ స్వంత నిబంధనలు. అయితే, భారతీయ మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారాన్ని వినియోగదారులను కలిగి ఉంది. దాని నిబంధనలు లేదా డిమాండ్లో ఏదైనా మార్పు దుబాయ్తో సహా ప్రపంచ బంగారం మార్కెట్పై పరోక్ష ప్రభావాన్ని చూపుతుంది.’’ అని తెలిపారు. దుబాయ్ బంగారు వ్యాపారం, ఆభరణాల తయారీకి ప్రధాన కేంద్రంగా ఉందని, ఇది భారతదేశంతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వినియోగదారులను అందిస్తుందని చెప్పారు.
“భారతదేశంలోని కొత్త హాల్మార్కింగ్ నియమాలు బంగారం ధర పెరుగుదలకు దారితీయవచ్చు.ఎందుకంటే ఆభరణాలు ప్రమాణాలకు అనుగుణంగా కొత్త యంత్రాలు కొనాల్సి ఉంటుంది. ఇది భారతదేశంలో బంగారు వస్తువుల ధరలో స్వల్ప పెరుగుదలకు దారితీయవచ్చు.ఇది దుబాయ్ బంగారం ధరలను వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. అయితే, మొత్తం ప్రభావం గ్లోబల్ బంగారం ధరలు, మారకం ధరలు, వినియోగదారుల ప్రాధాన్యతల వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉండవచ్చు." అని చిరాగ్ వోరా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!