యూఏఈ టాక్స్ రెసిడెన్సీ సర్టిఫికెట్లు: ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం
- March 08, 2023
యూఏఈ: ఒక సంవత్సరంలో 183 లేదా అంతకంటే ఎక్కువ రోజులు యూఏఈలో గడిపిన వ్యక్తులను టాక్స్ రెసిడెంట్స్ గా పరిగణిస్తారు. ఇలాంటి వారికి యూఏఈ టాక్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్(TRC) జారీ చేస్తుంది. యూఏఈతో ఒప్పందం చేసుకున్న దేశాలలో టాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్లతో డబుల్ టాక్స్ ఎగవేత ఒప్పందాల (DTAA) నుండి ప్రయోజనం పొందవచ్చు.
ఫెడరల్ టాక్స్ అథారిటీ వెబ్సైట్ ప్రకారం.. దరఖాస్తును సమర్పించడానికి దాదాపు 45 నిమిషాలు పడుతుంది. దరఖాస్తుదారు ఎంచుకున్న ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి ఒక సంవత్సరం పాటు TRC చెల్లుబాటు అవుతుంది. టాక్స్ రెసిడెన్సీని నిర్ణయించే నిబంధనలను స్పష్టం చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక ప్రకటనను జారీ చేసింది.
TRC పొందడానికి దశల వారీ ప్రక్రియ, ఖర్చులు..
- ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి.
- లాగిన్ అయిన తర్వాత, ‘సర్వీసెస్’ ట్యాబ్పై క్లిక్ చేయండి.
- డ్రాప్-డౌన్ మెనులో 'సర్టిఫికెట్లు'పై క్లిక్ చేయండి.
- ‘రిక్వెస్ట్ ఫర్ టాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్’పై క్లిక్ చేయండి.
- ఇది దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది. అందులో పేరు, ఎమిరేట్స్ ID నంబర్, పన్ను రిజిస్ట్రేషన్ నంబర్, సంప్రదింపు వివరాలు మొదలైన అన్ని వివరాలను నమోదు చేయాలి.
- పాస్పోర్ట్ కాపీలు, ఎమిరేట్స్ ID, అద్దె ఒప్పందం, యుటిలిటీ బిల్లు వంటి అన్ని అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి.
- దరఖాస్తు సమర్పించే ముందు అందులోని అన్ని వివరాలను సరిచూసుకోవాలి.
- ‘సడ్మిట్'పై క్లిక్ చేసిన తర్వాత చెల్లింపు గేట్వేకి లింక్ అవుతుంది. అక్కడ ప్రాసెసింగ్ రుసుము చెల్లించడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
- మీ దరఖాస్తును స్వీకరించిన తర్వాత.. FTA దానిని పరిశీలిస్తుంది. వారు ఆమోదం మంజూరు తెలిపితే.. కొన్ని రోజుల్లో TRC జారీ అవుతుంది.
- ఈ సర్టిఫికేట్ ఇమెయిల్ ద్వారా దరఖాస్తుదారులకు పంపబడుతుంది. అలాగే వ్యక్తి FTA ఖాతా నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అందుబాటులో ఉంటుంది.
- దరఖాస్తు సమర్పణ కోసం ఖర్చు Dh50, అన్ని పన్ను రిజిస్ట్రెంట్ల కోసం Dh500, పన్ను-కాని సహజ వ్యక్తులకు Dh1,000, నాన్-టాక్స్ రిజిస్ట్రెంట్ చట్టపరమైన వ్యక్తుల కోసం Dh1,750 రుసుములను ఖరారు చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







