సాయిధరమ్ తేజ్ 'సుప్రీమ్' సినిమాను మెచ్చిన చిరు!
- May 04, 2016
పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల తరువాత మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన మూవీ సుప్రీమ్. ఈ మూవీని మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న రాత్రి స్పెషల్ షో చూశారు. ఈ విశేషాలపై సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. తన లేటెస్ట్ మూవీ 'సుప్రీమ్'ను మావయ్య చిరంజీవి నిన్న రాత్రి చూసి ఎంజాయ్ చేశారని పేర్కొంటూ తన ఆనందాన్ని అభిమానులతో సాయి ధరమ్ పంచుకున్నాడు. ఈరోజు విడుదలవుతున్న తన మూవీ సక్సెస్ అవ్వాలని చిరంజీవి తనను, మూవీ యూనిట్ ను ఆశీర్వదించారని చెప్పాడు. అందుకు మామ చిరుకు ధన్యవాదాలు తెలుపుతూ యంగ్ హీరో ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.సాయిధరమ్తేజ్, రాశీ ఖన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'దిల్' రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన 'సుప్రీమ్' నేడు విడుదల కానున్న విషయం తెలిసిందే. చిరంజీవి హిట్ మూవీ 'యముడికి మొగుడు'లోని పాపులర్ సాంగ్ 'అందం హిందోళం... అధరం తాంబూలం...' ఇందులో రీమిక్స్ చేయడం అభిమానులను ఆకట్టుకుంటుందని సాయి ధరమ్ తో పాటు యూనిట్ భావిస్తోంది. ఈ మూవీ అందర్నీ అలరించే ఓ మాస్ ఎంటర్టైనర్. వేసవి సెలవుల్లో కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని యూనిట్ చెబుతోంది. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేయాలని భావించినా, భారీ సినిమాలు బరిలో ఉండటంతో వాయిదా వేయక తప్పలేదు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









