డేటా బ్రోకర్ ఉల్లంఘనలో ఇండియా 2వ స్థానం..
- March 10, 2023
డేటా బ్రోకర్ ఉల్లంఘనల విషయంలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని, గత 20 ఏళ్లలో 10 డేటా ఉల్లంఘనల ద్వారా 1.8 కోట్ల (18.7 మిలియన్) మంది భారతీయ పౌరుల వ్యక్తిగత రికార్డులు లీక్ అయ్యాయని ఒక నివేదిక వెల్లడించింది. డేటా బ్రోకర్ అనేది వివిధ రకాల మూలాధారాల నుంచి సమాచారాన్ని సమగ్రపరిచే వ్యాపారం. అది డేటాను మెరుగుపరచడం, రీఫ్రెష్ చేయడం లేదా విశ్లేషించడంతో పాటు ఇతర సంస్థలకు లైసెన్స్ ఇవ్వడం లాంటివి చేస్తుంది.
వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్ సర్ఫ్షార్క్ ద్వారా ప్రముఖ డేటా రిమూవల్ సర్వీస్ అయిన ఒక అజ్ణాత సంస్థ ప్రకారం, డేటా బ్రోకర్ ఉల్లంఘనల ద్వారా ఎక్కువగా అత్యంత ప్రభావితమైన మొదటి ఐదు దేశాలలో భారతదేశం ఒకటి. కాగా ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఆ దేశంలో 207.6 మిలియన్ల వ్యక్తిగత డేటా లీకైందట. ఇక ఇండియా తరువాత బ్రిటన్, బ్రెజిల్, కెనడా దేశాలు ఉన్నాయి.
“డేటా గోప్యత మరింత ప్రమాదకరంగా మారుతోంది. అయినప్పటికీ చాలా మందికి డేటా బ్రోకర్లు పనిచేసే రహస్య మార్కెట్ గురించి తెలియదు. కనుగొన్న వాటిని సమీక్షించిన తర్వాత, ఇతర కంపెనీల మాదిరిగానే డేటా బ్రోకర్లు కూడా డేటా ఉల్లంఘనకు గురువుతున్నట్లు మేము గమనించాము. అయితే వారు భారీ మొత్తంలో సున్నితమైన డేటాతో చెలగాటం ఆడుతున్నారు” అని సదరు అజ్ఞాత సంస్థ చీఫ్ డారియస్ బెలెజెవాస్ తెలిపారు.
ఈ అజ్ణాత సంస్థ పరిశోధకులు 506 నమోదిత, అమెరికా ఆధారిత డేటా బ్రోకర్లను విశ్లేషించారు. గత 20 సంవత్సరాలలో, ఈ కంపెనీలలో 23 (4.5 శాతం) డేటా ఉల్లంఘనలకు గురయ్యాయని, ఇప్పటి వరకు కనీసం 10 డేటా బ్రోకర్ ఉల్లంఘనల ఫలితంగా కనీసం పది లక్షల మంది వినియోగదారులు ఉన్నారని కనుగొన్నారు. మొత్తం 207 మిలియన్ల (2 కోట్లు) రికార్డులను బహిర్గతం చేశారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







