భక్తులకు అల్పాహారం...
- May 05, 2016
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త వినిపించింది. ఇప్పటివరకూ అందిస్తున్న ఉచిత భోజన సదుపాయంతోపాటు అల్పాహారాన్ని కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. వెంగమాంబ నిత్య అన్నప్రసాద సముదాయంలో భక్తులకు అల్పాహారాన్ని అందించే పథకానికి టీటీడీ ఈవో సాంబశివరావు శ్రీకారం చుట్టారు. భక్తులకు టిపిన్ను పెట్టి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రతీరోజూ ఉదయం పూట రెండు గంటల పాటు ఈ అల్పాహారాన్ని వడ్డిస్తారు. ఒకేసారి నాలుగు వేల మంది భక్తులకు అల్పాహారం అందించగల సామర్ధ్యం ఉందని ఈవో తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదం ట్రస్టు కింద మొత్తం 700 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నందుకు భక్తులకు ఉపయోగపడే మరిన్ని సౌకర్యాలపై దృష్టిపెట్టినట్లు సాంబశివరావు వెల్లడించారు.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









