దుబాయ్కి చెందిన ఎయిర్ హోస్టెస్ ఇండియాలో హత్య?
- March 15, 2023
యూఏఈ: దుబాయ్ వేదికగా కార్యక్రమాలు నిర్వహించే ఓ విమానయాన సంస్థలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేసే మహిళ ఇండియా బెంగళూరులోని శవమై కనిపించింది. ఆమె నివసించే భవనం నాల్గవ అంతస్తు నుండి ఆమె పడి మరణించిందని, ఆత్మహత్య కేసుగా ప్రాథమికంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో భవనం నాలుగో అంతస్తు నుంచి మహిళ పడిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై ప్రాథమిక విచారణలో బాధితురాలు తన ప్రియుడితో గొడవపడి బాల్కనీ నుంచి పడిపోయిందని తేలిందని వారు తెలిపారు. ఆమె మృతిపై ఆమె ప్రియుడు అధికారులకు సమాచారం అందించాడని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు ప్రాథమికంగా ఆత్మహత్యగా నిర్ధారించారని, అయితే అధికారులు ఇప్పుడు హత్యగా భావించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం యువతి ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ మహిళ దుబాయ్కి చెందిన అంతర్జాతీయ విమానయాన సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు
- భారత్లో 38,500 దాటిన రిజిస్టర్డ్ డ్రోన్ల సంఖ్య
- సౌదీలోని కొన్ని నగరాల్లో తగ్గిన చలి..!!
- ఖతార్ లో రమదాన్ క్యాలెండర్.. నెలంతా సందడే..!!
- ఒమానీ పౌరులకు అజర్బైజాన్ గుడ్ న్యూస్..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై పరిమితులు..!!
- బహ్రెయిన్ పౌరులకే పబ్లిక్ ఫార్మసీలు..!!
- దుబాయ్ లో పెయిడ్ పార్కింగ్ అవర్స్ రివైజ్డ్..రెండు గంటలు ఫ్రీ..!!
- సినీ నటి ప్రత్యూష మృతి కేసు..సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- భారత్ లోనే కాస్ట్లీ ఎయిర్పోర్ట్గా హైదరాబాద్..









