దుబాయ్కి చెందిన ఎయిర్ హోస్టెస్ ఇండియాలో హత్య?
- March 15, 2023
యూఏఈ: దుబాయ్ వేదికగా కార్యక్రమాలు నిర్వహించే ఓ విమానయాన సంస్థలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేసే మహిళ ఇండియా బెంగళూరులోని శవమై కనిపించింది. ఆమె నివసించే భవనం నాల్గవ అంతస్తు నుండి ఆమె పడి మరణించిందని, ఆత్మహత్య కేసుగా ప్రాథమికంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో భవనం నాలుగో అంతస్తు నుంచి మహిళ పడిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై ప్రాథమిక విచారణలో బాధితురాలు తన ప్రియుడితో గొడవపడి బాల్కనీ నుంచి పడిపోయిందని తేలిందని వారు తెలిపారు. ఆమె మృతిపై ఆమె ప్రియుడు అధికారులకు సమాచారం అందించాడని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు ప్రాథమికంగా ఆత్మహత్యగా నిర్ధారించారని, అయితే అధికారులు ఇప్పుడు హత్యగా భావించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం యువతి ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ మహిళ దుబాయ్కి చెందిన అంతర్జాతీయ విమానయాన సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







