దుబాయ్కి చెందిన ఎయిర్ హోస్టెస్ ఇండియాలో హత్య?
- March 15, 2023
యూఏఈ: దుబాయ్ వేదికగా కార్యక్రమాలు నిర్వహించే ఓ విమానయాన సంస్థలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేసే మహిళ ఇండియా బెంగళూరులోని శవమై కనిపించింది. ఆమె నివసించే భవనం నాల్గవ అంతస్తు నుండి ఆమె పడి మరణించిందని, ఆత్మహత్య కేసుగా ప్రాథమికంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో భవనం నాలుగో అంతస్తు నుంచి మహిళ పడిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై ప్రాథమిక విచారణలో బాధితురాలు తన ప్రియుడితో గొడవపడి బాల్కనీ నుంచి పడిపోయిందని తేలిందని వారు తెలిపారు. ఆమె మృతిపై ఆమె ప్రియుడు అధికారులకు సమాచారం అందించాడని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు ప్రాథమికంగా ఆత్మహత్యగా నిర్ధారించారని, అయితే అధికారులు ఇప్పుడు హత్యగా భావించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం యువతి ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ మహిళ దుబాయ్కి చెందిన అంతర్జాతీయ విమానయాన సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







