టర్కీ, సిరియాలకు 4 వేల ఫిఫా-22 క్యాబిన్లు
- March 21, 2023
అంకారా: ఫిఫా 2022 ప్రపంచ కప్ ఫుట్ బాల్ సందర్భంగా అభిమానుల కోసం వినియోగించిన 4,000 క్యాబిన్లను టర్కీ, సిరియాలో భూకంపం నుండి బయటపడిన వారి కోసం పంపినట్లు ఖతార్ అధికారులు వెల్లడించారు. అరేబియా గల్ఫ్లోని కార్గో షిప్లో తాజా బ్యాచ్ ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ క్యాబిన్లను లోడ్ చేసి పంపించారు. ఖతార్ డెవలప్మెంట్ ఫండ్ గత నెలలో క్యాబిన్ల షిప్పింగ్ ను ప్రారంభించింది. ఫిబ్రవరి 6న సంభవించిన భూకంపం కారణంగా నిరాశ్రయులైన మొత్తం 10,000 మందికి ఆశ్రయం కల్పించే ఉద్దేశంలో క్యాబిన్ ల తరలింపును ఖతార్ చేటట్టిందని అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది చివర్లో జరిగిన ఫుట్బాల్లో అతిపెద్ద టోర్నమెంట్ సందర్భంగా దేశంలోకి వచ్చిన 1.4 మిలియన్ల మంది అభిమానులలో కొందరికైనా ఈ విధంగా సహాయం ధన్యవాదాలు తెలిపే అవకాశం వచ్చిందన్నారు. ఈ రంగుల క్యాబిన్లలో ఇక ఫ్యామిలీ ఉండేలా నిర్మించారు. ఎయిర్ కండిషనింగ్, టాయిలెట్, షవర్ ఏర్పాట్లు ఉంటాయి. ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలోని కొన్ని ప్రాంతాలలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 52,000 మందికి పైగా మరణించారు. టర్కీలో అత్యధిక సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో 200,000 కంటే ఎక్కువ భవనాలు నేలమట్టం అయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
తాజా వార్తలు
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!







