టర్కీ, సిరియాలకు 4 వేల ఫిఫా-22 క్యాబిన్లు
- March 21, 2023
అంకారా: ఫిఫా 2022 ప్రపంచ కప్ ఫుట్ బాల్ సందర్భంగా అభిమానుల కోసం వినియోగించిన 4,000 క్యాబిన్లను టర్కీ, సిరియాలో భూకంపం నుండి బయటపడిన వారి కోసం పంపినట్లు ఖతార్ అధికారులు వెల్లడించారు. అరేబియా గల్ఫ్లోని కార్గో షిప్లో తాజా బ్యాచ్ ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ క్యాబిన్లను లోడ్ చేసి పంపించారు. ఖతార్ డెవలప్మెంట్ ఫండ్ గత నెలలో క్యాబిన్ల షిప్పింగ్ ను ప్రారంభించింది. ఫిబ్రవరి 6న సంభవించిన భూకంపం కారణంగా నిరాశ్రయులైన మొత్తం 10,000 మందికి ఆశ్రయం కల్పించే ఉద్దేశంలో క్యాబిన్ ల తరలింపును ఖతార్ చేటట్టిందని అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది చివర్లో జరిగిన ఫుట్బాల్లో అతిపెద్ద టోర్నమెంట్ సందర్భంగా దేశంలోకి వచ్చిన 1.4 మిలియన్ల మంది అభిమానులలో కొందరికైనా ఈ విధంగా సహాయం ధన్యవాదాలు తెలిపే అవకాశం వచ్చిందన్నారు. ఈ రంగుల క్యాబిన్లలో ఇక ఫ్యామిలీ ఉండేలా నిర్మించారు. ఎయిర్ కండిషనింగ్, టాయిలెట్, షవర్ ఏర్పాట్లు ఉంటాయి. ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలోని కొన్ని ప్రాంతాలలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 52,000 మందికి పైగా మరణించారు. టర్కీలో అత్యధిక సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో 200,000 కంటే ఎక్కువ భవనాలు నేలమట్టం అయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
తాజా వార్తలు
- నేపాల్లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







