టర్కీ, సిరియాలకు 4 వేల ఫిఫా-22 క్యాబిన్లు
- March 21, 2023
అంకారా: ఫిఫా 2022 ప్రపంచ కప్ ఫుట్ బాల్ సందర్భంగా అభిమానుల కోసం వినియోగించిన 4,000 క్యాబిన్లను టర్కీ, సిరియాలో భూకంపం నుండి బయటపడిన వారి కోసం పంపినట్లు ఖతార్ అధికారులు వెల్లడించారు. అరేబియా గల్ఫ్లోని కార్గో షిప్లో తాజా బ్యాచ్ ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ క్యాబిన్లను లోడ్ చేసి పంపించారు. ఖతార్ డెవలప్మెంట్ ఫండ్ గత నెలలో క్యాబిన్ల షిప్పింగ్ ను ప్రారంభించింది. ఫిబ్రవరి 6న సంభవించిన భూకంపం కారణంగా నిరాశ్రయులైన మొత్తం 10,000 మందికి ఆశ్రయం కల్పించే ఉద్దేశంలో క్యాబిన్ ల తరలింపును ఖతార్ చేటట్టిందని అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది చివర్లో జరిగిన ఫుట్బాల్లో అతిపెద్ద టోర్నమెంట్ సందర్భంగా దేశంలోకి వచ్చిన 1.4 మిలియన్ల మంది అభిమానులలో కొందరికైనా ఈ విధంగా సహాయం ధన్యవాదాలు తెలిపే అవకాశం వచ్చిందన్నారు. ఈ రంగుల క్యాబిన్లలో ఇక ఫ్యామిలీ ఉండేలా నిర్మించారు. ఎయిర్ కండిషనింగ్, టాయిలెట్, షవర్ ఏర్పాట్లు ఉంటాయి. ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలోని కొన్ని ప్రాంతాలలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 52,000 మందికి పైగా మరణించారు. టర్కీలో అత్యధిక సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో 200,000 కంటే ఎక్కువ భవనాలు నేలమట్టం అయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!









