భారత్ మ్యాప్లో తప్పుంటే భారీ జరిమానా
- May 06, 2016
భారత భౌగోళిక, నైసర్గిక సరిహద్దులకు సంబంధించి మ్యాప్లను ఆన్లైన్లో తప్పుగా చూపిస్తే, తప్పుడు మ్యాప్లను ప్రచురిస్తే గరిష్ఠంగా ఏడేళ్ల జైలుశిక్ష, కోటి రూపాయల నుంచి వంద కోట్ల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం తాజాగా ముసాయిదా బిల్లును రూపొందించింది. జమ్మూ కశ్మీర్ భూభాగాన్ని పాకిస్తాన్లో అంతర్భాగంగా, అరుణాచల్ ప్రదేశ్ను చైనాలో అంతర్భాగంగా ఇటీవల కొన్ని ఆన్లైన్ మ్యాపుల్లో చూపించిన కారణంగా భవిష్యత్లో ఇలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా నివారించేందుకు కేంద్రం 'జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్ బిల్-2016'ను రూపొందించింది.ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే గూగుల్ మ్యాప్స్ లేదా గూగుల్ ఎర్త్ ఇండియాను నిర్వహించాలంటే గూగుల్ సంస్థ కూడా భారతదేశంలోని సంబంధిత అథారిటీ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా గూగుల్ లాంటి సంస్థలు తగిన ఫీజును చెల్లించి లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త సంస్థలు అయితే ముందుగానే లైసెన్సులు తీసుకోవాలి. భారత నైసర్గిక ప్రాంతాలకు సంబంధించి శాటిలైట్, ఏరియల్, బెలూన్, మానవ రహిత విమానాలు తీసుకునే ఫొటోలు, రూపొందించే మ్యాప్లు, గ్రాఫిక్స్ ఏవైనా ఆన్లైన్లో, ఇంటర్నెట్ ఫ్లాట్ఫామ్లపై, ఎలక్ట్రానిక్ రూపంలో ప్రసారం చేయాలన్నా, ప్రచురించాలన్నా కేంద్రప్రభుత్వం లైసెన్స్ ఉండాల్సిందే. సర్వేలతో ప్రచురించే మ్యాప్లు, గ్రాఫిక్లకు కూడా లైసెన్స్ ఉండాల్సిందే.
భారత భూభాగాలకు సంబంధించిన ఫొటోలు, మ్యాప్లు, గ్రాఫిక్స్ సవ్యంగా ఉన్నాయా, లేదా? అన్న అంశాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు 'సెక్యూరిటీ వీటోయింగ్ అథారిటీ' అనే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అధిపతిగా ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ స్థాయి లేదా చైర్మన్ స్థాయి ఉద్యోగి ఉంటారు. ఈ కమిటీలో ఓ సాంకేతిక నిపుణుడు, జాతీయ భద్రతా నిపుణుడు సభ్యులుగా ఉంటారు. దరఖాస్తులను పరిశీలించి లైసెన్స్ను మంజూరుచేసే అధికారంతోపాటు దరఖాస్తులను తిరస్కరించే అధికారం కూడా ఈ వీటోయింగ్ అథారిటీకి ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్







