వచ్చే ఏడాది భారత్ దేశం వ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లలో వైఫై
- May 06, 2016
దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లలో వచ్చే ఏడాదికి వైఫై సదుపాయం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. వైఫై ద్వారా ఇంటర్నెట్ చాలా ఎక్కువ వేగంతో ఇస్తామని ప్రకటించారు. 400 స్టేషన్లలో వైఫై అందించడానికి గూగుల్తో అనుసంధానమైనట్లు చెప్పారు. ముంబయి సెంట్రల్ స్టేషన్ నుంచి ఈ సదుపాయాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాదికి పూర్తవుతుందన్నారు. పబ్లిక్ వైఫైలలో ప్రపంచంలోనే వేగంగా ఇంటర్నెట్ అందిస్తున్నట్లు విశాఖపట్నం, భువనేశ్వర్ రైల్వే స్టేషన్లలో నిరూపణ అయిందన్నారు.
వైఫై సదుపాయం కోసం రైల్వే గూగుల్తో పాటు ఇతర ఆపరేటర్ల సహాయం కూడా తీసుకుంటోందని సురేశ్ ప్రభు అన్నారు. ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్లో టెర్మినల్ అభివృద్ధి గురించి.. చర్చిగేట్ నుంచి శివాజీ టెర్మినల్కు కనెక్టివిటీ గురించి ఏప్రిల్ 21న మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశమైనప్పుడు చర్చించామన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









