వచ్చే ఏడాది భారత్ దేశం వ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లలో వైఫై
- May 06, 2016
దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లలో వచ్చే ఏడాదికి వైఫై సదుపాయం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. వైఫై ద్వారా ఇంటర్నెట్ చాలా ఎక్కువ వేగంతో ఇస్తామని ప్రకటించారు. 400 స్టేషన్లలో వైఫై అందించడానికి గూగుల్తో అనుసంధానమైనట్లు చెప్పారు. ముంబయి సెంట్రల్ స్టేషన్ నుంచి ఈ సదుపాయాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాదికి పూర్తవుతుందన్నారు. పబ్లిక్ వైఫైలలో ప్రపంచంలోనే వేగంగా ఇంటర్నెట్ అందిస్తున్నట్లు విశాఖపట్నం, భువనేశ్వర్ రైల్వే స్టేషన్లలో నిరూపణ అయిందన్నారు.
వైఫై సదుపాయం కోసం రైల్వే గూగుల్తో పాటు ఇతర ఆపరేటర్ల సహాయం కూడా తీసుకుంటోందని సురేశ్ ప్రభు అన్నారు. ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్లో టెర్మినల్ అభివృద్ధి గురించి.. చర్చిగేట్ నుంచి శివాజీ టెర్మినల్కు కనెక్టివిటీ గురించి ఏప్రిల్ 21న మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశమైనప్పుడు చర్చించామన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







