మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- August 25, 2026
మనామా: సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో మతపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని విచారణ పూర్తయ్యే వరకు కస్టడీలో ఉంచాలని బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది.
ఉత్తర గవర్నరేట్ ప్రాసిక్యూషన్ అధిపతి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు ఇస్లామిక్ ప్రముఖులు, మతపరమైన చిహ్నాలను అవమానించేలా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసి, సామాజిక శాంతి, ఐక్యతకు భంగం కలిగించే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ తెలిపింది.
ఈ కేసును జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ-కరప్షన్, ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీకి చెందిన సైబర్క్రైమ్ యూనిట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించింది. విచారణలో భాగంగా నిందితుడిని ప్రశ్నించిన అధికారులు, సోషల్ మీడియాలో ప్రసారమైన వీడియోలు మరియు అందులోని వ్యాఖ్యలపై అతడిని ప్రశ్నించారు. అనంతరం దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ముందస్తు నిర్బంధానికి ఆదేశించారు.
బహ్రెయిన్ చట్టాల ప్రకారం అభిప్రాయ వ్యక్తీకరణ, భావ ప్రకటనా స్వేచ్ఛ, మతాచరణ హక్కులు హామీ ఇవ్వబడ్డాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. అయితే మతపరమైన ప్రముఖులను అవమానించడం లేదా మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం ఈ హక్కుల పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. సామాజిక శాంతి, సహజీవనానికి ముప్పు కలిగించే వ్యాఖ్యలు లేదా చర్యలపై చట్టపరమైన చర్యలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







