పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- March 28, 2023
న్యూ ఢిల్లీ: పాన్-ఆధార్ లింక్ గడువును మరోసారి పెంచుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది.పాన్-ఆధార్ లింక్ గడువును జూన్ 30 వరకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ట్యాక్స్ చెల్లింపుదారులకు ఈ విషయంలో మరికొంత సమయం ఇచ్చే ఉద్దేశంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల ఎందరో వినియోగదారులకు మేలు జరగనుంది. మంగళవారం నాటి ఆదేశాల ప్రకారం.. జూన్ 30 లోపు పాన్-ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే. లేదంటే జూలై 1 నుంచి పాన్ నిరుపయోగంగా మారుతుంది. ఆ తర్వాత పన్నులు చెల్లించాల్సి వస్తే అదనపు జరిమానాల్ని కూడా కేంద్రం వసూలు చేస్తుంది. దీనివల్ల వినియోగదారులపై మరింత భారం పడుతుంది.
1961 నాటి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. పాన్ కార్డు ఉన్న ప్రతి వినియోగదారుడు, ఆ కార్డ్ నెంబర్ ఆధార్తో అనుసంధానం చేసుకోవాలి. దీనిపై కేంద్రం విధించిన గడువు గతంలోనే ముగిసింది. ఆ తర్వాత ఈ గడువును కేంద్రం పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం రూ.1,000 అపరాధ రుసుము చెల్లించి, మార్చి 31 వరకు ఆధార్-పాన్ అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. అయితే, మూడు రోజుల్లో ఈ గడువు ముగియనున్న నేపథ్యంలో మరోసారి గడువు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 51 కోట్ల పాన్ కార్డులు ఆధార్తో అనుసంధానమయ్యాయి. పాన్-ఆధార్ లింక్ అయి ఉంటేనే బ్యాంకు ఖాతా తెరవడం, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం వంటివి చేయొచ్చు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









