అభా ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య
- March 29, 2023
అభా : దక్షిణ యాసిర్ ప్రాంతంలోని అకాబా షార్ వద్ద సోమవారం జరిగిన ఘోర ట్రాఫిక్ ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరుకుంది. యాసిర్లోని ఆరోగ్య అధికారులు మరణించిన బాధితుల అవశేషాలను గుర్తించడానికి కాలిపోయిన మృతదేహాల నుండి DNA నమూనాలను సేకరించడం ప్రారంభించారు. మృతదేహాలను మహాయిల్ యాసిర్ ఆసుపత్రి మార్చురీకి తరలించగా.. గాయపడిన యాత్రికులు యాసిర్ సెంట్రల్ ఆసుపత్రి, మహాయిల్ ఆసుపత్రి, అభా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహాయిల్ గవర్నర్ ముహమ్మద్ అల్-కర్ఖా, మహయిల్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ముబారక్ అల్-ఖహ్తానీ తో కలిసి క్షతగాత్రులను పరామర్శించి, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు సాధ్యమైనంత మెరుగైన చికిత్స అందించాలని అల్-ఖర్ఖా ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం అకాబా షార్ వద్ద యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడి మంటలు చెలరేగడంతో మొత్తం 21 మంది ఉమ్రా యాత్రికులు మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు. అభా నగరాన్ని మహాయిల్ యాసిర్ గవర్నరేట్తో కలిపే అకాబా షార్ వద్ద రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి వంతెనపైకి దూసుకెళ్లి బోల్తా పడి మంటలు చెలరేగాయి. బాధితులంతా ఉమ్రా చేసేందుకు మక్కా వెళుతున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









