భార్యకు విషం ఇచ్చి.. కూతుళ్లను గొంతు కోసి చంపాడు..!
- March 31, 2023
యూఏఈ: మార్చి 28న భార్య, ఇద్దరు కూతుళ్లను చంపి ఆత్మహత్య చేసుకున్న ఇండియన్ కేసు దర్యాప్తు ప్రాథమిక నివేదికను షార్జా పోలీసులు వెల్లడించారు. 35 ఏళ్ల భారతీయ వ్యక్తి షార్జాలోని నివాస భవనం పై నుండి దూకే ముందే తన భార్య, పిల్లలను చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఫోరెన్సిక్ విచారణలో భార్యకు విషమిచ్చి చంపాడని తేలిందని, అయితే 3 నుండి 7 సంవత్సరాల మధ్య వయస్సు గల ఇద్దరు కుమార్తెల మెడపై గొంతు నులిమి చంపిన గుర్తులు కనిపించాయని షార్జా పోలీసు కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ సైఫ్ అల్ జరీ అల్ షమ్సీ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి షార్జా నివాసి అని, అయితే పొరుగున ఉన్న ఎమిరేట్లో పని చేస్తున్నాడని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సంక్షోభాలు లేవని కూడా వెల్లడైందన్నారు. నేరానికి పాల్పడిన భర్త ఆత్మహత్య వెనుక అసలు ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి అధికారులు మరింత దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- Dubai sees growth in international legal consultancy firms in Q1 2026
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS









