భార్యకు విషం ఇచ్చి.. కూతుళ్లను గొంతు కోసి చంపాడు..!
- March 31, 2023
యూఏఈ: మార్చి 28న భార్య, ఇద్దరు కూతుళ్లను చంపి ఆత్మహత్య చేసుకున్న ఇండియన్ కేసు దర్యాప్తు ప్రాథమిక నివేదికను షార్జా పోలీసులు వెల్లడించారు. 35 ఏళ్ల భారతీయ వ్యక్తి షార్జాలోని నివాస భవనం పై నుండి దూకే ముందే తన భార్య, పిల్లలను చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఫోరెన్సిక్ విచారణలో భార్యకు విషమిచ్చి చంపాడని తేలిందని, అయితే 3 నుండి 7 సంవత్సరాల మధ్య వయస్సు గల ఇద్దరు కుమార్తెల మెడపై గొంతు నులిమి చంపిన గుర్తులు కనిపించాయని షార్జా పోలీసు కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ సైఫ్ అల్ జరీ అల్ షమ్సీ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి షార్జా నివాసి అని, అయితే పొరుగున ఉన్న ఎమిరేట్లో పని చేస్తున్నాడని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సంక్షోభాలు లేవని కూడా వెల్లడైందన్నారు. నేరానికి పాల్పడిన భర్త ఆత్మహత్య వెనుక అసలు ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి అధికారులు మరింత దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







