ఇస్లాం ప్రవక్తలకు అవమానం.. ముగ్గురికి ఏడాది జైలుశిక్ష
- March 31, 2023
బహ్రెయిన్: ఇస్లాం మత నియమాలను ఉల్లంఘించినందుకు, ప్రవక్తలను కించపరిచినందుకు బహ్రెయిన్ నాల్గవ క్రిమినల్ కోర్టు గురువారం ముగ్గురు దోషులకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. 'అల్-తాజ్దీద్ కల్చరల్ అండ్ సోషల్ సొసైటీ'లో సభ్యులుగా ఉన్న ఈ ముగ్గురిపై మోపిన ఆరోపణలపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాత శిక్షలను ఖరారు చేసింది. సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, యాంటీ-సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సూచన మేరకు ముగ్గురు నిందితులు ఇస్లాం సిద్ధాంతాలను ఉల్లంఘించినందుకు ప్రవక్తలను అవమానించినందుకు కోర్టు వారిని దోషులుగా నిర్ధారించింది. నిందితులు ఇస్లామిక్ విశ్వాసంపై అనుమానం కలిగేలా.. ప్రవక్తలను అవహేళన చేస్తూ ఇంటర్నెట్లో బ్లాగులు, వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా ఇస్లామిక్ మతం ప్రాథమికాలను ఉద్దేశపూర్వకంగా అణగదొక్కారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







