ఇస్లాం ప్రవక్తలకు అవమానం.. ముగ్గురికి ఏడాది జైలుశిక్ష
- March 31, 2023
బహ్రెయిన్: ఇస్లాం మత నియమాలను ఉల్లంఘించినందుకు, ప్రవక్తలను కించపరిచినందుకు బహ్రెయిన్ నాల్గవ క్రిమినల్ కోర్టు గురువారం ముగ్గురు దోషులకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. 'అల్-తాజ్దీద్ కల్చరల్ అండ్ సోషల్ సొసైటీ'లో సభ్యులుగా ఉన్న ఈ ముగ్గురిపై మోపిన ఆరోపణలపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాత శిక్షలను ఖరారు చేసింది. సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, యాంటీ-సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సూచన మేరకు ముగ్గురు నిందితులు ఇస్లాం సిద్ధాంతాలను ఉల్లంఘించినందుకు ప్రవక్తలను అవమానించినందుకు కోర్టు వారిని దోషులుగా నిర్ధారించింది. నిందితులు ఇస్లామిక్ విశ్వాసంపై అనుమానం కలిగేలా.. ప్రవక్తలను అవహేళన చేస్తూ ఇంటర్నెట్లో బ్లాగులు, వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా ఇస్లామిక్ మతం ప్రాథమికాలను ఉద్దేశపూర్వకంగా అణగదొక్కారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
తాజా వార్తలు
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- పిన్ లేకుండానే UPI పేమెంట్స్..









