ఖరీదైన కారు కొనుగోలు చేసిన ముకేశ్
- June 21, 2015
పారిశ్రామిక దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్).. ఛైర్మన్ ముకేశ్ అంబానీ కోసం ప్రపంచంలో అత్యంత అధునాతన, భద్రమైన(బుల్లెట్ ప్రూఫ్) కారును కొనుగోలు చేసింది. అనూహ్య దాడులను ఎదుర్కొనేందుకు వీలుగా లెవెల్-9 వెహికిల్ రెసిస్టెన్స్(వీఆర్9) టెక్నాలజీతో డిజైన్ చేసిన మెర్సిడెజ్ బెంజ్ ఎస్600 కారును జర్మనీ నుంచి తెప్పించింది. ప్రపంచంలో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అత్యంత భద్రత కవచదారి సాంకేతికత ఇదే. అంతేకాదు, దేశంలో తొలి వీఆర్9 టెక్నాలజీ ఎస్600 మోడల్ కూడా. జర్మనీలోని సిండెలింగెన్లో ఉన్న బెంజ్ ప్లాంట్లో దీన్ని రూపొందించారు. బెంజ్ ఎస్600 కనిష్ఠ ధర రూ.1.5 కోట్లు. ఇంకా వీఆర్9 టెక్నాలజీ ఫిట్టింగ్లు, విదేశం నుంచి దిగుమతి చేసుకున్నందున చెల్లించిన సుంకం, ఇతర చార్జీలు, బీమా ప్రీమియం అన్నీ కలిపి మొత్తం రూ. 11 కోట్ల వరకు ఖర్చయి ఉండొచ్చని అంచనా. శనివారం ముంబై సెంట్రల్ రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో ఈ వాహన రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా పూర్తయినట్లు తెలిసింది. ముకేశ్ అంబానీకి మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 2013 నుంచే జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తోంది. తాజాగా ఆయన భద్రత కవచంలోకి బెంజ్ ఎస్600 కూడా చేరింది. అధునాతన భద్రతతో కూడిన కార్లను కొనుగోలు చేస్తున్న పారిశ్రామిక, రాజకీయ ప్రముఖుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఎందుకంటే 2015 మోడల్ ఎస్600 డెలివరీ వెయిటింగ్ లిస్ట్లో ఆర్ఐఎల్ది 57వ స్థానం కావడం గమనార్హం.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







