ఖర్జూరం బొబ్బట్లు
- June 21, 2015
కావలిసిన పదార్ధాలు
మైదాపిండి - 4 కప్పులు
ఖర్జూరాలు - 25
నెయ్యి - 6 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి -1 టీ స్పూను
పంచదార పొడి - 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు పొడి - 2 టేబుల్ స్పూన్లు
పుట్నాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
ఎండు కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
పల్లీల పొడి - 2 టేబుల్ స్పూన్లు
తయారు చేసే విధానం
ముందుగా మైదా పిండిలో తగినన్ని నీళ్లు, కాస్త నెయ్యి పోసి పూరీ పిండిలా కలిపి ఉంచాలి. ఖర్జూరాల లోపలి గింజలను తీసి ముద్దలా రుబ్బాలి. ఓ గిన్నెలో ఖర్జూరాల ముద్ద, పైన చెప్పిన పొడులన్నింటినీ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండల్లా చేయాలి. మైదాపిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి, పూరీలా ఒత్తి దానిలో ఒక్కో ఖర్జూరం ఉండని ఉంచి, దానిని చేత్తో గానీ, అప్పడాల కర్రతో గానీ నెయ్యి రాసుకుంటూ బొబ్బట్ల మాదిరిగా వత్తాలి. ఇలాగే అన్నీ చేసుకుని కాలిన పెనం మీద నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి. ఎక్కువ తీపి కావాలనుకునేవారు బొబ్బట్టు కాల్చిన వెంటే దాని మీద కొద్దిగా పంచదార పొడి చల్లితే టేస్ట్ మరింత అధికంగా ఉంటుంది. మరింకేం చేసేద్దామా వేడి వేడి ఖర్జూరం బొబ్బట్లు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







