ఖర్జూరం బొబ్బట్లు
- June 21, 2015
కావలిసిన పదార్ధాలు
మైదాపిండి - 4 కప్పులు
ఖర్జూరాలు - 25
నెయ్యి - 6 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి -1 టీ స్పూను
పంచదార పొడి - 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు పొడి - 2 టేబుల్ స్పూన్లు
పుట్నాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
ఎండు కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
పల్లీల పొడి - 2 టేబుల్ స్పూన్లు
తయారు చేసే విధానం
ముందుగా మైదా పిండిలో తగినన్ని నీళ్లు, కాస్త నెయ్యి పోసి పూరీ పిండిలా కలిపి ఉంచాలి. ఖర్జూరాల లోపలి గింజలను తీసి ముద్దలా రుబ్బాలి. ఓ గిన్నెలో ఖర్జూరాల ముద్ద, పైన చెప్పిన పొడులన్నింటినీ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండల్లా చేయాలి. మైదాపిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి, పూరీలా ఒత్తి దానిలో ఒక్కో ఖర్జూరం ఉండని ఉంచి, దానిని చేత్తో గానీ, అప్పడాల కర్రతో గానీ నెయ్యి రాసుకుంటూ బొబ్బట్ల మాదిరిగా వత్తాలి. ఇలాగే అన్నీ చేసుకుని కాలిన పెనం మీద నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి. ఎక్కువ తీపి కావాలనుకునేవారు బొబ్బట్టు కాల్చిన వెంటే దాని మీద కొద్దిగా పంచదార పొడి చల్లితే టేస్ట్ మరింత అధికంగా ఉంటుంది. మరింకేం చేసేద్దామా వేడి వేడి ఖర్జూరం బొబ్బట్లు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







