ఖర్జూరం బొబ్బట్లు
- June 21, 2015
కావలిసిన పదార్ధాలు
మైదాపిండి - 4 కప్పులు
ఖర్జూరాలు - 25
నెయ్యి - 6 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి -1 టీ స్పూను
పంచదార పొడి - 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు పొడి - 2 టేబుల్ స్పూన్లు
పుట్నాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
ఎండు కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
పల్లీల పొడి - 2 టేబుల్ స్పూన్లు
తయారు చేసే విధానం
ముందుగా మైదా పిండిలో తగినన్ని నీళ్లు, కాస్త నెయ్యి పోసి పూరీ పిండిలా కలిపి ఉంచాలి. ఖర్జూరాల లోపలి గింజలను తీసి ముద్దలా రుబ్బాలి. ఓ గిన్నెలో ఖర్జూరాల ముద్ద, పైన చెప్పిన పొడులన్నింటినీ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండల్లా చేయాలి. మైదాపిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి, పూరీలా ఒత్తి దానిలో ఒక్కో ఖర్జూరం ఉండని ఉంచి, దానిని చేత్తో గానీ, అప్పడాల కర్రతో గానీ నెయ్యి రాసుకుంటూ బొబ్బట్ల మాదిరిగా వత్తాలి. ఇలాగే అన్నీ చేసుకుని కాలిన పెనం మీద నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి. ఎక్కువ తీపి కావాలనుకునేవారు బొబ్బట్టు కాల్చిన వెంటే దాని మీద కొద్దిగా పంచదార పొడి చల్లితే టేస్ట్ మరింత అధికంగా ఉంటుంది. మరింకేం చేసేద్దామా వేడి వేడి ఖర్జూరం బొబ్బట్లు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









