హిమాచల్‌ ప్రదేశ్‌లో బస్సు లోయలో పడి 14 మంది మృతి

- May 07, 2016 , by Maagulf
హిమాచల్‌ ప్రదేశ్‌లో బస్సు లోయలో పడి 14 మంది మృతి

బస్సు లోయలో పడి 14 మంది మృతిచెందిన ఘటన హిమాచల్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం.. శనివారం అర్ధరాత్రి 55 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మండి జిల్లా వద్దకు చేరుకోగానే అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మృతదేహాలను వెలికి తీశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com