ఆన్లైన్ లో బైక్ సేల్ పేరిట Dh44,000 మోసం.. ఇద్దరికి జైలుశిక్ష
- April 10, 2023
దుబాయ్: షాపింగ్ వెబ్సైట్లో నకిలీ ప్రకటనలు పోస్ట్ చేసి ఆన్లైన్ షాపింగ్ చేసే వ్యక్తిని 44,000 దిర్హామ్ లు మోసం చేసిన ఇద్దరు ఆఫ్రికన్లకు దుబాయ్ మిస్డిమినర్ కోర్టు ఒక నెల జైలుశిక్ష, ఆ తర్వాత యూఏఈ నుండి బహిష్కరణ విధించింది. గల్ఫ్ పౌరుడిని మోసం చేసినందుకు దోషులుగా తేలిన తర్వాత వారిని ఇంటర్నెట్ను ఉపయోగించకుండా నిషేధించారు. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా 22,000 దిర్హామ్లకు బైక్ను అమ్ముతానని బాధితుడిని మోసం చేశారు. బీమా, కస్టమ్స్ ఫీ వంటి కారణాలతో రెండుసార్లు బాధితుడి నుంచి నిందితులు Dh44,000 వసూలు చేశారు. చివరకు షిప్మెంట్ను డెలివరీ చేయడానికి 5,000 దిర్హామ్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో మోసానికి గురైనట్లు గ్రహించిన బాధితుడు.. పోలీసులను ఆశ్రయించాడు. కేసును విచారించిన కోర్టు నిందితులిద్దరిని దోషులుగా తేల్చి శిక్షలు విధించింది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్









