ఇరాన్-సౌదీ అరేబియాల మధ్య వాణిజ్య విమానాలు పునరుద్ధరణ
- April 11, 2023
టెహ్రాన్: ఇరాన్ మరియు సౌదీ అరేబియాల మధ్య వాణిజ్య విమానాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దౌత్య సంబంధాలకు సన్నాహాలు పూర్తయ్యాయని, ఈ వారంలో ఇరాన్ ప్రతినిధి బృందం సౌదీ రాజధాని రియాద్కు వెళుతుందని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి అలీ రెజా ఎనయటి పేర్కొన్నారు. అలాగే సౌదీ అరేబియా నుండి ఓ సాంకేతిక ప్రతినిధి బృందం ఇరాన్లోని సౌదీ రాయబార కార్యాలయాన్ని సందర్శించి.. వాణిజ్య విమానాల పున: ప్రారంభానికి సంబంధించిన అంశాలను చర్చిస్తుందని అన్నారు.
దౌత్య సంబంధాల పునరుద్ధరణతో పాటు రెండు నెలల్లో రాయబార కార్యాలయాలు, దౌత్య కార్యకలాపాలను పున: ప్రారంభించడంపై చైనా అధ్యక్షుడు చొరవతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మార్చి 10న ఇరు దేశాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, సౌదీ రాజు ఫైసల్ బిన్ ఫర్హాన్లు బీజింగ్లో సమావేశమై సంయుక్త ప్రకటనపై సంతకం చేసినట్లు మీడియా తెలిపింది. అనంతరం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణమయ్యేందుకు బీజింగ్ మధ్యవర్తిత్వ ఒప్పందం సానుకూల ప్రభావాన్ని చూపిందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు వాణిజ్య , ఆర్థిక సంబంధాలు మెరగయ్యేందుకు దోహదం చేస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







