ఇరాన్-సౌదీ అరేబియాల మధ్య వాణిజ్య విమానాలు పునరుద్ధరణ
- April 11, 2023
టెహ్రాన్: ఇరాన్ మరియు సౌదీ అరేబియాల మధ్య వాణిజ్య విమానాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దౌత్య సంబంధాలకు సన్నాహాలు పూర్తయ్యాయని, ఈ వారంలో ఇరాన్ ప్రతినిధి బృందం సౌదీ రాజధాని రియాద్కు వెళుతుందని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి అలీ రెజా ఎనయటి పేర్కొన్నారు. అలాగే సౌదీ అరేబియా నుండి ఓ సాంకేతిక ప్రతినిధి బృందం ఇరాన్లోని సౌదీ రాయబార కార్యాలయాన్ని సందర్శించి.. వాణిజ్య విమానాల పున: ప్రారంభానికి సంబంధించిన అంశాలను చర్చిస్తుందని అన్నారు.
దౌత్య సంబంధాల పునరుద్ధరణతో పాటు రెండు నెలల్లో రాయబార కార్యాలయాలు, దౌత్య కార్యకలాపాలను పున: ప్రారంభించడంపై చైనా అధ్యక్షుడు చొరవతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మార్చి 10న ఇరు దేశాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, సౌదీ రాజు ఫైసల్ బిన్ ఫర్హాన్లు బీజింగ్లో సమావేశమై సంయుక్త ప్రకటనపై సంతకం చేసినట్లు మీడియా తెలిపింది. అనంతరం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణమయ్యేందుకు బీజింగ్ మధ్యవర్తిత్వ ఒప్పందం సానుకూల ప్రభావాన్ని చూపిందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు వాణిజ్య , ఆర్థిక సంబంధాలు మెరగయ్యేందుకు దోహదం చేస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









