ఢిల్లీ-మస్కట్ విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా
- April 11, 2023
మస్కట్: భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరాల్సిన విమాన సర్వీసులను రద్దు చేసింది. ట్రావెల్ ఏజెంట్లందరికీ ఏప్రిల్ 10న జారీ చేసిన సర్క్యులర్ (15/23) ప్రకారం.. “ఢిల్లీ-మస్కట్ ఫ్లైట్ సర్వీసును ఏప్రిల్ 29, మే 6, మే 13, మే 14, మే 20, మే 27 వ తేదీల్లో రద్దు చేయబడింది.’’ అని ఎయిర్ ఇండియా తెలిపింది. ఆయా తేదీల్లో మస్కట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో సీట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ వెంటనే తెలియజేయాలని ఆ సర్క్యులర్లో కోరారు. ప్రయాణీకులు ఎలాంటి పెనాల్టీలు లేకుండా పూర్తి రీఫండ్ను ఎంచుకోవచ్చు లేదా ప్రత్యామ్నాయ తేదీల్లో సీట్లను రీబుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!









