ఢిల్లీ-మస్కట్ విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా
- April 11, 2023
మస్కట్: భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరాల్సిన విమాన సర్వీసులను రద్దు చేసింది. ట్రావెల్ ఏజెంట్లందరికీ ఏప్రిల్ 10న జారీ చేసిన సర్క్యులర్ (15/23) ప్రకారం.. “ఢిల్లీ-మస్కట్ ఫ్లైట్ సర్వీసును ఏప్రిల్ 29, మే 6, మే 13, మే 14, మే 20, మే 27 వ తేదీల్లో రద్దు చేయబడింది.’’ అని ఎయిర్ ఇండియా తెలిపింది. ఆయా తేదీల్లో మస్కట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో సీట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ వెంటనే తెలియజేయాలని ఆ సర్క్యులర్లో కోరారు. ప్రయాణీకులు ఎలాంటి పెనాల్టీలు లేకుండా పూర్తి రీఫండ్ను ఎంచుకోవచ్చు లేదా ప్రత్యామ్నాయ తేదీల్లో సీట్లను రీబుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







