పాదచారుల ప్రమాదాల నిరోధానికి స్మార్ట్ సిగ్నల్స్
- April 11, 2023
దుబాయ్: ‘స్మార్ట్ పాదచారుల సిగ్నల్స్’ ప్రాజెక్ట్ రెండవ దశను దుబాయ్ రోడ్లు, రవాణా అథారిటీ (RTA) ప్రారంభించింది. ఇందులో భాగంగా మరో 10 కొత్త ప్రాంతాలలో సిగ్నల్స్ ను ఏర్పాటు చేయనుంది. మొత్తంగా 2024 నాటికి స్మార్ట్ పాదచారుల సిగ్నల్ల సంఖ్యను 28కి పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. మొదటి దశలో ఈ సిగ్నళ్లను అమర్చిన ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, పాదచారుల భద్రతను ఈ వ్యవస్థ మెరుగుపరిచిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సెన్సార్ల ఆధారంగా స్మార్ట్ సిగ్నల్ లైట్ ఆపరేషన్ పనిచేస్తుంది. పేవ్మెంట్పై (వీధిని దాటడానికి ముందు), పాదచారుల క్రాసింగ్పై (దాటుతున్నప్పుడు) పాదచారుల కదలికను ఈ సెన్సార్లు గుర్తిస్తాయని, స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ పాదచారుల భద్రతను గణనీయంగా పెంచుతుందని, సిగ్నల్ టైమింగ్ మెరుగైన నిర్వహణను నిర్ధారిస్తుందని ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విభాగం డైరెక్టర్ మొహమ్మద్ అల్ అలీ వివరించారు.
తాజా వార్తలు
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!
- సీబీఎస్ఈ 12.. రీవాల్యుయేషన్ కు పెరుగుతున్న దరఖాస్తులు..కారణం ఇదేనా?









