పాదచారుల ప్రమాదాల నిరోధానికి స్మార్ట్ సిగ్నల్స్
- April 11, 2023
దుబాయ్: ‘స్మార్ట్ పాదచారుల సిగ్నల్స్’ ప్రాజెక్ట్ రెండవ దశను దుబాయ్ రోడ్లు, రవాణా అథారిటీ (RTA) ప్రారంభించింది. ఇందులో భాగంగా మరో 10 కొత్త ప్రాంతాలలో సిగ్నల్స్ ను ఏర్పాటు చేయనుంది. మొత్తంగా 2024 నాటికి స్మార్ట్ పాదచారుల సిగ్నల్ల సంఖ్యను 28కి పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. మొదటి దశలో ఈ సిగ్నళ్లను అమర్చిన ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, పాదచారుల భద్రతను ఈ వ్యవస్థ మెరుగుపరిచిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సెన్సార్ల ఆధారంగా స్మార్ట్ సిగ్నల్ లైట్ ఆపరేషన్ పనిచేస్తుంది. పేవ్మెంట్పై (వీధిని దాటడానికి ముందు), పాదచారుల క్రాసింగ్పై (దాటుతున్నప్పుడు) పాదచారుల కదలికను ఈ సెన్సార్లు గుర్తిస్తాయని, స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ పాదచారుల భద్రతను గణనీయంగా పెంచుతుందని, సిగ్నల్ టైమింగ్ మెరుగైన నిర్వహణను నిర్ధారిస్తుందని ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విభాగం డైరెక్టర్ మొహమ్మద్ అల్ అలీ వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







