‘విరూపాక్ష’తో సాయి ధరమ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా.?
- April 11, 2023
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం ‘విరూపాక్ష’. నేటి ట్రెండ్కి దూరంగా, మూఢ నమ్మకాలు, చేత బడుల నేపథ్యంలో హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్లో రూపొందుతోన్న సినిమానే ‘విరూపాక్ష’.
ఆల్రెడీ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్లు. ట్రైలర్ కూడా ఇంటెన్సింగ్గా వుంది. సాయి ధరమ్ తేజ్ కొత్తగా కనిపిస్తున్నాడు. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా వుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో జరిగిన కొన్ని నమ్మకాల ఆసరాగా తెరకెక్కిన చిత్రమిది.
వర్కవుట్ అయితే తేజు నయా ట్రెండ్ సృష్టించినట్లే. లేదంటే, ఇదో పెద్ద టాస్కే అవుతుంది సాయి ధరమ్ తేజ్కి. ట్రైలర్ అయితే బాగా కట్ చేశారు. ఆధ్యంతం ఆసక్తిగా వుంది. మూఢ నమ్మకం నుంచి ఓ ఊరిని కాపాడేందుకు వచ్చిన ‘విరూపాక్ష’గా తేజు నటించాడు.
సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది. కార్తిక్ దండు ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతుండగా, సుకుమార్ కథ, స్క్రీన్ప్లే అందించడం ఈ సినిమాకి మరో ప్లస్. చూడాలి మరి, తేజు రిస్క్ ఫలిస్తుందో లేదో.!
తాజా వార్తలు
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!
- సీబీఎస్ఈ 12.. రీవాల్యుయేషన్ కు పెరుగుతున్న దరఖాస్తులు..కారణం ఇదేనా?
- ఖలాలీలో హయా బియా వేడుకలకు భారీ స్పందన..!!
- ఇరాన్ ప్రెసిడెంట్ తో చర్చలు జరిపిన అమీర్..!!









