‘విరూపాక్ష’తో సాయి ధరమ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా.?
- April 11, 2023
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం ‘విరూపాక్ష’. నేటి ట్రెండ్కి దూరంగా, మూఢ నమ్మకాలు, చేత బడుల నేపథ్యంలో హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్లో రూపొందుతోన్న సినిమానే ‘విరూపాక్ష’.
ఆల్రెడీ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్లు. ట్రైలర్ కూడా ఇంటెన్సింగ్గా వుంది. సాయి ధరమ్ తేజ్ కొత్తగా కనిపిస్తున్నాడు. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా వుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో జరిగిన కొన్ని నమ్మకాల ఆసరాగా తెరకెక్కిన చిత్రమిది.
వర్కవుట్ అయితే తేజు నయా ట్రెండ్ సృష్టించినట్లే. లేదంటే, ఇదో పెద్ద టాస్కే అవుతుంది సాయి ధరమ్ తేజ్కి. ట్రైలర్ అయితే బాగా కట్ చేశారు. ఆధ్యంతం ఆసక్తిగా వుంది. మూఢ నమ్మకం నుంచి ఓ ఊరిని కాపాడేందుకు వచ్చిన ‘విరూపాక్ష’గా తేజు నటించాడు.
సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది. కార్తిక్ దండు ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతుండగా, సుకుమార్ కథ, స్క్రీన్ప్లే అందించడం ఈ సినిమాకి మరో ప్లస్. చూడాలి మరి, తేజు రిస్క్ ఫలిస్తుందో లేదో.!
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







