ఐకానిక్ మస్జీదు ‘వన్స్ అపాన్ ఎ టైమ్ మ్యూజియం’ ప్రారంభం
- April 12, 2023
దుబాయ్: దుబాయ్ జుమేరా మస్జీదు ఆవరణలో ఇప్పుడు కొత్త మ్యూజియం సందర్శకులను ఆకట్టుకుంటుంది. అరుదైన కళాఖండాలు, ఐకానిక్ ఛాయాచిత్రాలు, పాతకాలపు వస్తువులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. జుమేరా మస్జీదు మజ్లిస్లోని మొదటి అంతస్తులో ఉన్న వన్స్ అపాన్ ఎ టైమ్ మ్యూజియం సోమవారం నాడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. షేక్ మొహమ్మద్ సెంటర్ ఫర్ కల్చరల్ అండర్స్టాండింగ్ (SMCC) వ్యవస్థాపకుడు అబ్దుల్లా బిన్ ఈసా అల్ సెర్కల్ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఎమిరాటీస్, విదేశీయుల మధ్య పరస్పర సాంస్కృతిక అవగాహనను ప్రోత్సహిస్తుందన్నారు. ఎమిరాటీస్ను జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రజలకు ఈ మ్యూజియం అవకాశం కల్పిస్తోందన్నారు.
ఈ మ్యూజియంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ మస్జీదుల ప్రదర్శన, UAE స్థాపనను ప్రకటిస్తూ డిసెంబర్ 2, 1971 నుండి అల్ ఇత్తిహాద్ వార్తాపత్రిక మొదటి పేజీని ప్రదర్శించే ప్రదర్శనతో సహా అనేక ఆకర్షణీయమైన విభాగాలు ఉన్నాయి. సందర్శకులు ఓడ తయారీ సాధనాలు, నషాబా (చెక్క కాటాపుల్ట్), రహా (60వ దశకంలో ఎమిరాటీ ఇళ్లలో పిండి మరియు ధాన్యాన్ని రుబ్బుకోవడానికి ఉపయోగించే రాయి గ్రైండర్) ఇతర కళాఖండాలను ఒకే చోట చూడవచ్చు. వారానికి ఆరు రోజులపాటు.. అన్ని మతాల సందర్శకులకు మ్యూజియం ఆహ్వానం పలుకుతుంది. వన్స్ అపాన్ ఎ టైమ్ మ్యూజియం శుక్రవారాల్లో తప్ప ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 వరకు తెరిచి ఉంటుంది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









