భారతీయ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత

- April 12, 2023 , by Maagulf
భారతీయ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత

న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్ మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా (99) కన్నుమూశారు. అతని మరణాన్ని ఇన్‌స్పేస్ ఛైర్మన్ పవన్ కె గోయెంకా ఒక ట్వీట్‌లో ధృవీకరించారు.  "పారిశ్రామిక ప్రపంచం ఈరోజు అత్యంత ఉన్నతమైన వ్యక్తులలో ఒకరిని కోల్పోయింది. వ్యాపారం, ఆర్థిక విషయాలను కేషుబ్ మహీంద్రా ద్వారానే ప్రేరణ పొందాను. " అని గోయెంకా తన ట్వీట్ లో పేర్కొన్నారు. కేషుబ్ మహీంద్రా.. 1963 నుండి 2012 వరకు దాదాపు ఐదు దశాబ్దాల పాటు తన తండ్రికి చెందిన సంస్థలకు  ఛైర్మన్‌గా పనిచేశారు. అనంతరం తన మేనల్లుడు, ప్రస్తుత చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు పగ్గాలు అప్పగించి శేషజీవితాన్ని గడుపుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com