రవాణా శాఖ సిస్టమ్ హ్యాక్.. ఆసియా ప్రోగ్రామర్ కు జరిమానా
- April 12, 2023
దుబాయ్: 36 ఏళ్ల ఆసియా ప్రోగ్రామర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కార్డ్లకు క్రెడిట్లను రీఛార్జి చేసే సిస్టమ్ను హ్యాక్ చేశాడు. మొత్తం Dh107,000 విలువైన 81 కార్డ్లను అక్రమంగా రీఛార్జ్ చేశాడు. దుబాయ్ మిస్డిమినర్ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి.. 91,000 దిర్హామ్ల జరిమానా విధించింది. పోలీసు రికార్డుల ప్రకారం, దుబాయ్లోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలోని ఆటోమేటిక్ కలెక్షన్ సిస్టమ్స్ సూపర్వైజర్.. రవాణా కార్డుల మధ్య నగదు బదిలీ వ్యవస్థలో జరుగుతున్న అనుమానాస్పద లావాదేవీలను గుర్తించాడు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలుపగా.. ఒక గుర్తుతెలియని వ్యక్తి (“నిందితుడు”) సిస్టమ్ను హ్యాక్ చేసి, రీఛార్జ్ చేయడానికి.. కార్డ్ల మధ్య మొత్తాలను బదిలీ చేయడానికి 81 కార్డ్లను ఉపయోగించినట్లు వారు గుర్తించారు. నిందితుడు ఎమిరాటీ గుర్తింపుతో నమోదు చేసుకున్న అకౌంట్ ద్వారా హ్యాక్ చేసినట్లు.. నిందితుడు ఆసియా ప్రోగ్రామర్ గా అధికారులు తెలుసుకున్నారు. అనంతరం ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. కేసు ఫైల్ ప్రకారం.. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అతను స్మార్ట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్లోని బగ్(లొసుగు) ద్వారా సిస్టమ్ను హ్యాక్ చేసినట్లు తలిపారు. కోర్టు ప్రోగ్రామర్ ని దోషిగా నిర్ధారించి తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







