ఇఫ్తార్ పంపిణీకి డబ్బులు చెల్లిస్తే..Dh300,000 జరిమానా!
- April 13, 2023
యూఏఈ: అబుధాబిలో పంపిణీ చేయడానికి ఇఫ్తార్ భోజనాన్ని సిద్ధం చేయడానికి రెస్టారెంట్లు, క్యాటరర్లకు చెల్లించడం మానుకోవాలని పౌరులు,నివాసితులకు డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (DCD) అబుధాబి సూచించింది. దీనికి బదులుగా స్వచ్ఛంద విరాళాలు, ఆర్థిక సహకారాలు అబుధాబిలోని లైసెన్స్ పొందిన సంస్థల ద్వారా మాత్రమే అందించాలని కోరింది. "అనుమతి పొందకుండానే విరాళాలు సేకరించడం లేదా స్వీకరించడం చేస్తే.. Dh150,000 - Dh300,000 మధ్య జరిమానా, జైలుశిక్ష విధించే అవకాశం ఉందని DCD హెచ్చరించింది.
ఇఫ్తార్ విందులను సిద్ధం చేయడానికి అవుట్సోర్సింగ్, రెస్టారెంట్లకు చెల్లించడం 2021 ఫెడరల్ లా నంబర్ (3), యూఏఈలో నిధుల సేకరణ కార్యకలాపాలు, విరాళాలను నియంత్రించే దాని బైలాను ఉల్లంఘించడమేనని డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. అబుధాబిలో విరాళాలను సేకరించడం, నిర్వహించేందుకు DCD నుండి అనుమతి పొందాల్సి ఉంటుంది. నిధుల సేకరణ లైసెన్స్ పొందిన సంస్థలు మినహా.. స్వచ్ఛంద సంస్థలు, సమాఖ్య, స్థానిక మరియు పౌర సంస్థలు చట్టాల ద్వారా అనుమతించబడతాయని డీసీడీ పేర్కొంది.
తాజా వార్తలు
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!







