ఒమన్ తీరంలో 5.8 తీవ్రతతో భూకంపం
- April 13, 2023
మస్కట్: ఒమన్లోని అరేబియా సముద్ర తీరంలో గురువారం ఉదయం 5.8 తీవ్రతతో భూకంపం నమోదైందని యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్సిఎం) తెలిపింది. ఒమన్లోని ఓడరేవు నగరమైన సుర్కు 500 కిలోమీటర్ల దూరంలో సముద్రం దిగువన 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) భూకంపం తీవ్రత 5.4 గా అంచనా వేసింది. యూఏఈపై భూకంప ప్రభావం లేదని, ఎక్కడా భూకంప ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం అందలేదని ఎన్సిఎం డిపార్ట్మెంట్ ఆఫ్ సిస్మోలజీ డైరెక్టర్ ఖలీఫా అల్ ఎబ్రీ తెలిపారు. అరేబియా సముద్రంలో ఉదయం 7.24 గంటలకు భూకంపం సంభవించినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!







