అవినీతి ఆరోపణలు.. పలువురు ప్రభుత్వ అధికారులు అరెస్ట్
- April 14, 2023
జెడ్డా: లక్షలాది రియాల్స్తో కూడిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ప్రభుత్వ అధికారులతో పాటు పౌరులు, ప్రవాసులను అరెస్టు చేసినట్లు పర్యవేక్షణ , అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) ప్రకటించింది. అరెస్టయిన వారిపై లంచం, అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్, ఫోర్జరీ వంటి నేరాలు ఉన్నాయి. వారిపై చట్టపరమైన చర్యలను పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని నజాహా వెల్లడించింది.
కేసుల వివరాలను వివరిస్తూ.. ప్రవాస కార్మికుల వృత్తి మార్పు కోసం SR6.6 మిలియన్ల మొత్తాన్ని పొందినందుకు ఒకరిని, ఫైనల్ ఎగ్జిట్ వీసాను అక్రమ పద్ధతిలో రద్దు చేసినందుకు మరోకరిని, రాష్ట్ర ఖజానాకు SR75.75 మిలియన్లు ఎగ్గొట్టిన కేసులో మరికొందరు ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే యూనివర్సిటీలో SR6496304ను దుర్వినియోగం చేసిన కేసులో డైరెక్టర్, ఎగ్జిక్యూషన్ కోర్ట్ ఖాతా నుండి SR8.84 మిలియన్లను దొంగిలించినందుకు ఓ ప్రవాసుడిని, ప్రాజెక్టులలో మోసాలు తదితర కేసులలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురుని అరెస్ట్ చేసినట్లు నజాహా తెలిపింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







