అవినీతి ఆరోపణలు.. పలువురు ప్రభుత్వ అధికారులు అరెస్ట్
- April 14, 2023
జెడ్డా: లక్షలాది రియాల్స్తో కూడిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ప్రభుత్వ అధికారులతో పాటు పౌరులు, ప్రవాసులను అరెస్టు చేసినట్లు పర్యవేక్షణ , అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) ప్రకటించింది. అరెస్టయిన వారిపై లంచం, అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్, ఫోర్జరీ వంటి నేరాలు ఉన్నాయి. వారిపై చట్టపరమైన చర్యలను పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని నజాహా వెల్లడించింది.
కేసుల వివరాలను వివరిస్తూ.. ప్రవాస కార్మికుల వృత్తి మార్పు కోసం SR6.6 మిలియన్ల మొత్తాన్ని పొందినందుకు ఒకరిని, ఫైనల్ ఎగ్జిట్ వీసాను అక్రమ పద్ధతిలో రద్దు చేసినందుకు మరోకరిని, రాష్ట్ర ఖజానాకు SR75.75 మిలియన్లు ఎగ్గొట్టిన కేసులో మరికొందరు ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే యూనివర్సిటీలో SR6496304ను దుర్వినియోగం చేసిన కేసులో డైరెక్టర్, ఎగ్జిక్యూషన్ కోర్ట్ ఖాతా నుండి SR8.84 మిలియన్లను దొంగిలించినందుకు ఓ ప్రవాసుడిని, ప్రాజెక్టులలో మోసాలు తదితర కేసులలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురుని అరెస్ట్ చేసినట్లు నజాహా తెలిపింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









