యూఏఈ డ్యూటీ ఫ్రీ అమ్మకాలు: వచ్చే 4 ఏళ్లలో ఆ దేశాలదే సింహాభాగం...!
- April 14, 2023
యూఏఈ: భారతదేశం, చైనా, యూకే ప్రయాణికులు రాబోయే నాలుగు సంవత్సరాలలో యూఏఈ డ్యూటీ ఫ్రీ అమ్మకాలను శాసించనున్నారు. యూరోమానిటర్ ఇంటర్నేషనల్ విడుదల చేసిన కొత్త అధ్యయనం ప్రకారం.. విమాన ప్రయాణంలో పునరుద్ధరణ యూఏఈ ప్రీ-పాండమిక్ స్థాయిల కంటే ఇన్బౌండ్ డ్యూటీ ఫ్రీ అమ్మకాలను గణనీయంగా పెంచింది. సగటున ప్రతి ప్రయాణికుడి వ్యయం $100ని దాటింది. యూఏఈ మహమ్మారి సమయంలో ప్రయాణ, పర్యాటక సంక్షోభాన్ని ఎదుర్కొందని, అనంతరం కాలంలో దుబాయ్, అబుధాబిలు రికార్డు స్థాయిలో డ్యూటీ ఫ్రీ అమ్మకాలను నమోదు చేశాయని అధ్యయనం తెలిపింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ 2022లో Dh6.34 బిలియన్ల ($1.74 బిలియన్లు) వార్షిక విక్రయాలను నమోదు చేయగా.. ఇది గత సంవత్సరం కంటే 78 శాతం అధికం కావడం విశేషం. అంతర్జాతీయ ప్రయాణీకుల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయమైన దుబాయ్ ఇంటర్నేషనల్లో ప్రయాణికుల రద్దీ రెట్టింపు కంటే ఎక్కువ (2022లో 66 మిలియన్లు) పెరిగింది. రాబోయే నాలుగేళ్లలో అవుట్బౌండ్ ప్రయాణీకుల వ్యయం గణనీయంగా పెరుగుతుందని అధ్యయనం అంచనా వేసింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







