యూఏఈ డ్యూటీ ఫ్రీ అమ్మకాలు: వచ్చే 4 ఏళ్లలో ఆ దేశాలదే సింహాభాగం...!

- April 14, 2023 , by Maagulf
యూఏఈ డ్యూటీ ఫ్రీ అమ్మకాలు: వచ్చే 4 ఏళ్లలో ఆ దేశాలదే సింహాభాగం...!

యూఏఈ: భారతదేశం, చైనా, యూకే ప్రయాణికులు రాబోయే నాలుగు సంవత్సరాలలో యూఏఈ డ్యూటీ ఫ్రీ అమ్మకాలను శాసించనున్నారు.  యూరోమానిటర్ ఇంటర్నేషనల్ విడుదల చేసిన కొత్త అధ్యయనం ప్రకారం.. విమాన ప్రయాణంలో పునరుద్ధరణ యూఏఈ ప్రీ-పాండమిక్ స్థాయిల కంటే ఇన్‌బౌండ్ డ్యూటీ ఫ్రీ అమ్మకాలను గణనీయంగా పెంచింది. సగటున ప్రతి ప్రయాణికుడి వ్యయం $100ని దాటింది. యూఏఈ మహమ్మారి సమయంలో ప్రయాణ, పర్యాటక సంక్షోభాన్ని ఎదుర్కొందని, అనంతరం కాలంలో దుబాయ్, అబుధాబిలు రికార్డు స్థాయిలో డ్యూటీ ఫ్రీ అమ్మకాలను నమోదు చేశాయని అధ్యయనం తెలిపింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ 2022లో Dh6.34 బిలియన్ల ($1.74 బిలియన్లు) వార్షిక విక్రయాలను నమోదు చేయగా..  ఇది గత సంవత్సరం కంటే 78 శాతం అధికం కావడం విశేషం. అంతర్జాతీయ ప్రయాణీకుల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయమైన దుబాయ్ ఇంటర్నేషనల్‌లో ప్రయాణికుల రద్దీ రెట్టింపు కంటే ఎక్కువ (2022లో 66 మిలియన్లు) పెరిగింది. రాబోయే నాలుగేళ్లలో అవుట్‌బౌండ్ ప్రయాణీకుల వ్యయం గణనీయంగా పెరుగుతుందని అధ్యయనం అంచనా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com