యూఏఈ డ్యూటీ ఫ్రీ అమ్మకాలు: వచ్చే 4 ఏళ్లలో ఆ దేశాలదే సింహాభాగం...!
- April 14, 2023
యూఏఈ: భారతదేశం, చైనా, యూకే ప్రయాణికులు రాబోయే నాలుగు సంవత్సరాలలో యూఏఈ డ్యూటీ ఫ్రీ అమ్మకాలను శాసించనున్నారు. యూరోమానిటర్ ఇంటర్నేషనల్ విడుదల చేసిన కొత్త అధ్యయనం ప్రకారం.. విమాన ప్రయాణంలో పునరుద్ధరణ యూఏఈ ప్రీ-పాండమిక్ స్థాయిల కంటే ఇన్బౌండ్ డ్యూటీ ఫ్రీ అమ్మకాలను గణనీయంగా పెంచింది. సగటున ప్రతి ప్రయాణికుడి వ్యయం $100ని దాటింది. యూఏఈ మహమ్మారి సమయంలో ప్రయాణ, పర్యాటక సంక్షోభాన్ని ఎదుర్కొందని, అనంతరం కాలంలో దుబాయ్, అబుధాబిలు రికార్డు స్థాయిలో డ్యూటీ ఫ్రీ అమ్మకాలను నమోదు చేశాయని అధ్యయనం తెలిపింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ 2022లో Dh6.34 బిలియన్ల ($1.74 బిలియన్లు) వార్షిక విక్రయాలను నమోదు చేయగా.. ఇది గత సంవత్సరం కంటే 78 శాతం అధికం కావడం విశేషం. అంతర్జాతీయ ప్రయాణీకుల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయమైన దుబాయ్ ఇంటర్నేషనల్లో ప్రయాణికుల రద్దీ రెట్టింపు కంటే ఎక్కువ (2022లో 66 మిలియన్లు) పెరిగింది. రాబోయే నాలుగేళ్లలో అవుట్బౌండ్ ప్రయాణీకుల వ్యయం గణనీయంగా పెరుగుతుందని అధ్యయనం అంచనా వేసింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







