మిస్ ఇండియా 2023గా నందిని గుప్తా..
- April 16, 2023
ఇంఫాల్: 59వ ఫెమినా మిస్ ఇండియా ఫైనల్ పోటీలు శనివారం (ఏప్రిల్ 15న) మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మిస్ ఇండియాలు, ప్రముఖ బాలీవుడ్ నటీనటులు విచ్చేశారు. ఫైనల్ కి వచ్చిన టాప్ 30 కంటెస్టెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని 30 రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు ఫైనల్ కి వచ్చారు. ఆ 30 మంది కంటెస్టెంట్స్ ఫైనల్ లో తమ అందం, అభినయంతో మెప్పించారు.
ఈ సారి ఫెమినా మిస్ ఇండియా 2023 విన్నర్ గా ఆ 30 మంది సుందరీమణుల నుంచి రాజస్థాన్ కి చెందిన 19 ఏళ్ళ నందిని గుప్తా ఎంపికైంది. 59వ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని నందిని గుప్తా అందుకుంది. గతేడాది మిస్ ఇండియాగా నిలిచినా సినీ శెట్టి కిరీటాన్ని నందిని గుప్తాకి అలంకరించింది. ఇక మొదటి రన్నరప్ గా ఢిల్లీకి చెందిన శ్రేయా పూంజా, రెండో రన్నరప్ గా మణిపూర్ కి చెందిన తౌనోజమ్ స్ట్రెలా లువాంగ్ లు నిలిచారు.
ఈ ఏడాది మిస్ ఇండియా పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి గోమతి, తెలంగాణ నుంచి ఊర్మిళ చౌహన్ లు ఫైనల్ వరకు వెళ్లారు.ఇక విన్నర్స్ ని కార్యక్రమానికి విచ్చేసిన కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే, పలువురు ప్రముఖులు అభినందించారు. నందిని గుప్తాకు దేశవ్యాప్తంగా అభినందనలు వస్తున్నాయి. మిస్ వరల్డ్ పోటీల్లో ఈమె భారత్ తరపున ప్రాతినిధ్యం వహించబోతుంది.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









