దుబాయ్ అగ్నిప్రమాదం: పలువురిని కాపాడిన భారతీయ కార్మికులకు నివాళులు
- April 17, 2023
యూఏఈ: దుబాయ్ భవన అగ్నిప్రమాదం జరిగిన సమయంలో పలువురిని కాపాడిన భారతీయ కార్మికులకు ఆ భవనం నుంచి బయటపడ్డ అద్దెదారులు నివాళులర్పించారు. ఏప్రిల్ 15 మధ్యాహ్నం దీరాలోని దురదృష్టకర ఘటనలో భవన నిర్మాణ కార్మికులైన సలియకోండు గూడు, ఇమామ్ కాసిం మరణించారు. వారు సురక్షితంగా బయటపడే అవకాశం ఉన్నా.. భవనంలోని అద్దెదారులను కాపాడేందుకు వారు ప్రాధాన్యత ఇచ్చారు. వీరి కారణంగా అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డ పలువురు ఈ సందర్భంగా భారతీయ కార్మికుల త్యాగాలను స్మరించుకున్నారు. వారు వచ్చి తలుపుతట్టి విషయం చెప్పడంతోనే తన ప్రాణాలు మూడవ అంతస్తులో నివసిస్తున్న పాకిస్తాన్ ప్రవాస ముదస్సిర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇద్దరు భారతీయ కార్మికులు మంటలను ఆర్పడానికి గ్రౌండ్ ఫ్లోర్ నుండి నాల్గవ అంతస్తు వరకు పరుగెత్తి చాలామంది ప్రాణాలను కాపాడి.. దట్టమైన పొగలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారని పలువురు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్లో వ్యక్తికి జైలుశిక్ష..!!









