దుబాయ్ అగ్నిప్రమాదం: పలువురిని కాపాడిన భారతీయ కార్మికులకు నివాళులు
- April 17, 2023
యూఏఈ: దుబాయ్ భవన అగ్నిప్రమాదం జరిగిన సమయంలో పలువురిని కాపాడిన భారతీయ కార్మికులకు ఆ భవనం నుంచి బయటపడ్డ అద్దెదారులు నివాళులర్పించారు. ఏప్రిల్ 15 మధ్యాహ్నం దీరాలోని దురదృష్టకర ఘటనలో భవన నిర్మాణ కార్మికులైన సలియకోండు గూడు, ఇమామ్ కాసిం మరణించారు. వారు సురక్షితంగా బయటపడే అవకాశం ఉన్నా.. భవనంలోని అద్దెదారులను కాపాడేందుకు వారు ప్రాధాన్యత ఇచ్చారు. వీరి కారణంగా అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డ పలువురు ఈ సందర్భంగా భారతీయ కార్మికుల త్యాగాలను స్మరించుకున్నారు. వారు వచ్చి తలుపుతట్టి విషయం చెప్పడంతోనే తన ప్రాణాలు మూడవ అంతస్తులో నివసిస్తున్న పాకిస్తాన్ ప్రవాస ముదస్సిర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇద్దరు భారతీయ కార్మికులు మంటలను ఆర్పడానికి గ్రౌండ్ ఫ్లోర్ నుండి నాల్గవ అంతస్తు వరకు పరుగెత్తి చాలామంది ప్రాణాలను కాపాడి.. దట్టమైన పొగలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారని పలువురు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







