బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
- April 17, 2023
రియాద్ : తూర్పు ప్రావిన్స్లోని ప్రత్యేక రహదారి భద్రతా దళాలు దమ్మామ్-రియాద్ హైవేపై తల్లిదండ్రుల వద్ద నుంచి తప్పిపోయిన చిన్నారిని ఎట్టకేలకు గుర్తించింది. ఆరోగ్యంగా ఉన్న ఆ చిన్నారిని కుటుంబసభ్యులకు అప్పగించారు. “తూర్పు ప్రావిన్స్లోని డమ్మామ్-రియాద్ హైవేపై బాధితులు తమ వాహనాన్ని ఆపినప్పుడు.. చిన్నారి వాహనం నుంచి దిగింది. కానీ ఇది గమనించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం జరిగిన పొరబాటును గుర్తించి.. తమ చిన్నారిని కాపాడాలని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు తప్పిపోయిన చిన్నారిని గుర్తించి వారి పేరెంట్స్ కు అప్పగించారు. ’’ అని స్పెషల్ రోడ్ సెక్యూరిటీ ఫోర్సెస్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేసింది. హైవే వినియోగదారులు ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, రహదారులపై ప్రయాణించేటప్పుడు భద్రతా సూచనలను పాటించాలని వాహనదారులను ప్రత్యేక రహదారి భద్రతా దళాలు కోరాయి.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!







