నేటి నుంచి ఉత్తర భారతంలో చార్ధామ్ యాత్ర
- May 09, 2016
ఉత్తర భారతంలోని నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యమునోత్రి, బద్రినాథ్, కేదార్నాథ్ ఆలయ దర్శనాల నిమిత్తం చార్ధామ్ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. అక్షయ తృతీయ సందర్భంగా ఉత్తరకాశీలోని గంగోత్రి, యమునోత్రి, రుద్రప్రయాగలోని కేదార్నాథ్ ఆలయ ద్వారాలు నేడు తెరుచుకోనున్నాయి.
మధ్యాహ్న సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలు తెరుస్తారని అధికారులు తెలిపారు. చమోలీ జిల్లాలోని మరో పుణ్యక్షేత్రమైన బద్రినాథ్ ఆలయ ద్వారాలు మే 11న తెరుచుకుంటాయి. చార్ధామ్ యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయా జిల్లా అధికారులు తెలిపారు. ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏటా శీతాకాలం సమయంలో ఆరు నెలలపాటు ఈ ఆలయాల ద్వారాలు మూసివేస్తారు. తిరిగి వేసవి కాలంలో దైవదర్శనాన్ని కల్పిస్తారు. 2013లో ఉత్తరాఖండ్లో వరదలు రావడంతో వేల సంఖ్యలో యాత్రికులు మృతిచెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







