నేటి నుంచి ఉత్తర భారతంలో చార్ధామ్ యాత్ర
- May 09, 2016
ఉత్తర భారతంలోని నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యమునోత్రి, బద్రినాథ్, కేదార్నాథ్ ఆలయ దర్శనాల నిమిత్తం చార్ధామ్ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. అక్షయ తృతీయ సందర్భంగా ఉత్తరకాశీలోని గంగోత్రి, యమునోత్రి, రుద్రప్రయాగలోని కేదార్నాథ్ ఆలయ ద్వారాలు నేడు తెరుచుకోనున్నాయి.
మధ్యాహ్న సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలు తెరుస్తారని అధికారులు తెలిపారు. చమోలీ జిల్లాలోని మరో పుణ్యక్షేత్రమైన బద్రినాథ్ ఆలయ ద్వారాలు మే 11న తెరుచుకుంటాయి. చార్ధామ్ యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయా జిల్లా అధికారులు తెలిపారు. ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏటా శీతాకాలం సమయంలో ఆరు నెలలపాటు ఈ ఆలయాల ద్వారాలు మూసివేస్తారు. తిరిగి వేసవి కాలంలో దైవదర్శనాన్ని కల్పిస్తారు. 2013లో ఉత్తరాఖండ్లో వరదలు రావడంతో వేల సంఖ్యలో యాత్రికులు మృతిచెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







