తగ్గిన బంగారం ధర

- May 09, 2016 , by Maagulf
తగ్గిన బంగారం ధర

రెండేళ్ల గరిష్ఠ ధరకు చేరుకున్న పసిడి సోమవారం స్వల్పంగా దిగివచ్చింది. రూ.250 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.30,100కు చేరింది. ధర ఎక్కువగా ఉండటంతో అక్షయ తృతీయ పర్వదినం కొనుగోళ్లు ప్రోత్సాహకరంగా లేకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో ఇవాళ ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.7శాతం తగ్గి 1,279.80 అమెరికన్‌ డాలర్లకు చేరింది.

వెండి ధర సైతం సోమవారం తగ్గింది. రూ.350 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.41,200కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు వెండి ధర 17.37 యూఎస్‌ డాలర్లకు చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com