భారత్ కరోనా అప్డేట్

- April 20, 2023 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. భారత దేశంలో కోవిడ్ కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,591 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి 40 మంది మృతి చెందారు. బుధవారం నమోదైన కేసులతో పోల్చితే 20 శాతం పాజిటివ్ కేసులు పెరిగాయి. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 65,283 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి.

ఇప్పటి వరకు 4.47 కోట్ల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి 5.31లక్షల మంది మృతి చెందారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, యూపీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.

దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 5.46 శాతంగా ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16 వల్ల దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకు భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com