బంగ్లాదేశ్‌లో మెరుపుల భీభత్సం..9 మంది రైతు కార్మికులు మృతి

- April 24, 2023 , by Maagulf
బంగ్లాదేశ్‌లో మెరుపుల భీభత్సం..9 మంది రైతు కార్మికులు మృతి

ఢాకా:  బంగ్లాదేశ్‌లో ఆదివారం రెండు గంటల పాటు వర్షంతో పాటు మెరుపులు భీభత్సం సృష్టించాయి. దీంతో పొలాల్లో పనిచేస్తున్న తొమ్మిది మంది రైతు కార్మికులు మరణించారు.  స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 10.00 గంటల నుండి 11.00 గంటల కురిసిన భారీ వర్షానికి సునమ్‌గంజ్‌, మౌల్విబజార్‌, సిల్హెట్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మరణాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా దక్షిణాసియాలో మే, జూన్‌ల మధ్య మెరుపులు, పిడుగులతో అత్యధిక మరణాలు నమోదవుతుంటాయి. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌లో కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  దీంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటోంది. వాతావరణ మార్పులే ఈ ప్రమాదాలకు కారణాలవుతున్నాయని నిపుణులు తేల్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com