బంగ్లాదేశ్లో మెరుపుల భీభత్సం..9 మంది రైతు కార్మికులు మృతి
- April 24, 2023
ఢాకా: బంగ్లాదేశ్లో ఆదివారం రెండు గంటల పాటు వర్షంతో పాటు మెరుపులు భీభత్సం సృష్టించాయి. దీంతో పొలాల్లో పనిచేస్తున్న తొమ్మిది మంది రైతు కార్మికులు మరణించారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 10.00 గంటల నుండి 11.00 గంటల కురిసిన భారీ వర్షానికి సునమ్గంజ్, మౌల్విబజార్, సిల్హెట్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మరణాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా దక్షిణాసియాలో మే, జూన్ల మధ్య మెరుపులు, పిడుగులతో అత్యధిక మరణాలు నమోదవుతుంటాయి. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటోంది. వాతావరణ మార్పులే ఈ ప్రమాదాలకు కారణాలవుతున్నాయని నిపుణులు తేల్చారు.
తాజా వార్తలు
- యూఏఈ లో 'గుడ్బై ఆల్ ఇన్సెక్ట్స్' ఉత్పత్తుల రీకాల్..!!
- రోడ్డు ప్రమాదం.. సాయానికి ఆపిన వ్యక్తి వాహనం చోరీ..!!
- కువైట్ విమానాశ్రయం T1 ప్రారంభం.. ఒక్కో విమానయాన సంస్థకు రోజుకు ఒక సర్వీసు..!!
- అవినీతి ఆరోపణలపై 160 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్:నజాహా
- ఖతార్లో ఆరోగ్య నిబంధనల ఉల్లంఘన..ప్రముఖ ఫుడ్ కోర్టులు సీజ్..!!
- బలమైన ఆర్థిక సంబంధాలపై బహ్రెయిన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- షార్జా టవర్లో మెట్ల పై నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి..!!
- ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు NATS భారీ విరాళం
- దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ పై కొత్త చట్టం జారీ చేసిన షేక్ మహ్మద్
- కువైట్ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు పరార్.. దేశవ్యాప్తంగా ముమ్మర గాలింపు









