బియ్యం కడిగిన నీటితో అందం
- May 09, 2016
సాధారణంగా బియ్యం కడిగిన నీరు పారబోస్తాం లేదా పశువులకు తాగిస్తాం. అయితే ఈ నీటితో అందం పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. బియ్యం కడిగిన నీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ చర్మానికే కాకుండా జుట్టుకు కూడా అదనపు సౌందర్యాన్ని అందిస్తాయట. మొటిమలపైనా బియ్యం కడిగిన నీళ్లు ప్రభావం చూపిస్తాయి. బియ్యం కడిగిన నీటిలో మాములు టిష్యు పేపర్ ని ముంచి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ చర్మం తాజాగా, మృదువుగా మారుతుంది. ఈ నీటితో ముఖంపై రాషెస్ ఉన్న ప్రదేశంలో నునుపుగా రుద్దితే మంచి గుణం కనిపిస్తుంది. పదిహేను నిమిషాల వ్యవధిలో రెండుసార్లు బియ్యం కడిగే నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖంపై రాషెస్ తగ్గుతాయి. బియ్యం కడిగిన నీటితో జుట్టు కుదుళ్లను కూడా శుభ్రం చేసుకోవచ్చు. బియ్యం కడిగిన నీటిని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే సిల్కీ హెయిర్ మీ సొంతం అవుతుంది. ఈ నీళ్లకు ఐదు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపితే మంచి ఫలితం కనిపిస్తుంది. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే జుట్టు బలంగా మారుతుంది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









