బియ్యం కడిగిన నీటితో అందం
- May 09, 2016
సాధారణంగా బియ్యం కడిగిన నీరు పారబోస్తాం లేదా పశువులకు తాగిస్తాం. అయితే ఈ నీటితో అందం పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. బియ్యం కడిగిన నీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ చర్మానికే కాకుండా జుట్టుకు కూడా అదనపు సౌందర్యాన్ని అందిస్తాయట. మొటిమలపైనా బియ్యం కడిగిన నీళ్లు ప్రభావం చూపిస్తాయి. బియ్యం కడిగిన నీటిలో మాములు టిష్యు పేపర్ ని ముంచి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ చర్మం తాజాగా, మృదువుగా మారుతుంది. ఈ నీటితో ముఖంపై రాషెస్ ఉన్న ప్రదేశంలో నునుపుగా రుద్దితే మంచి గుణం కనిపిస్తుంది. పదిహేను నిమిషాల వ్యవధిలో రెండుసార్లు బియ్యం కడిగే నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖంపై రాషెస్ తగ్గుతాయి. బియ్యం కడిగిన నీటితో జుట్టు కుదుళ్లను కూడా శుభ్రం చేసుకోవచ్చు. బియ్యం కడిగిన నీటిని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే సిల్కీ హెయిర్ మీ సొంతం అవుతుంది. ఈ నీళ్లకు ఐదు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపితే మంచి ఫలితం కనిపిస్తుంది. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే జుట్టు బలంగా మారుతుంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







