బియ్యం కడిగిన నీటితో అందం
- May 09, 2016
సాధారణంగా బియ్యం కడిగిన నీరు పారబోస్తాం లేదా పశువులకు తాగిస్తాం. అయితే ఈ నీటితో అందం పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. బియ్యం కడిగిన నీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ చర్మానికే కాకుండా జుట్టుకు కూడా అదనపు సౌందర్యాన్ని అందిస్తాయట. మొటిమలపైనా బియ్యం కడిగిన నీళ్లు ప్రభావం చూపిస్తాయి. బియ్యం కడిగిన నీటిలో మాములు టిష్యు పేపర్ ని ముంచి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ చర్మం తాజాగా, మృదువుగా మారుతుంది. ఈ నీటితో ముఖంపై రాషెస్ ఉన్న ప్రదేశంలో నునుపుగా రుద్దితే మంచి గుణం కనిపిస్తుంది. పదిహేను నిమిషాల వ్యవధిలో రెండుసార్లు బియ్యం కడిగే నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖంపై రాషెస్ తగ్గుతాయి. బియ్యం కడిగిన నీటితో జుట్టు కుదుళ్లను కూడా శుభ్రం చేసుకోవచ్చు. బియ్యం కడిగిన నీటిని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే సిల్కీ హెయిర్ మీ సొంతం అవుతుంది. ఈ నీళ్లకు ఐదు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపితే మంచి ఫలితం కనిపిస్తుంది. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే జుట్టు బలంగా మారుతుంది.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







