కార్న్ ప్రాన్స్
- May 09, 2016
కావలసిన పదార్థాలు: పెద్ద రొయ్యలు - 2, కూరగాయలు ఉడికించిన నీరు -400 గ్రా., అల్లం - 10 గ్రా., వెల్లుల్లి -10 గ్రా., మొక్కజొన్నపిండి - 1 టేబుల్ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా.
రొయ్యలకు పట్టించడానికి: మొక్కజొన్న పిండి - 30 గ్రా., తెల్లసొన - 2 గుడ్లవి, ఉప్పు రుచికి తగినంత.
తయారుచేసే విధానం: రొయ్యల్ని ముందుగా పొట్టుతీసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రలో మొక్కజొన్నపిండి, గుడ్ల తెల్లసొన, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ జారులో రొయ్యల్ని ముంచి, నూనెలో 80 శాతం దాకా వేగించాలి. ఇపడు మరో పాత్రలో టేబుల్ స్పూను నూనె వేసి అల్లం, వెలుల్లి ముక్కల్ని వేగించి కూరగాయలు ఉడికించిన నీటిని కలపాలి. నీళ్లు మసులుతుండగా రొయ్యల్ని ఇందులో వేసి మిగతా 20 శాతం ఉడికించాలి. ఒక టేబుల్ స్పూను మొక్కజొన్నపిండి నీళ్లలో కలిపివేసి కాసేపుంచి దించేయాలి. ఇది అన్నంలోకి నంజుకోడానికి బాగుంటుంది..
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









