కార్న్ ప్రాన్స్
- May 09, 2016
కావలసిన పదార్థాలు: పెద్ద రొయ్యలు - 2, కూరగాయలు ఉడికించిన నీరు -400 గ్రా., అల్లం - 10 గ్రా., వెల్లుల్లి -10 గ్రా., మొక్కజొన్నపిండి - 1 టేబుల్ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా.
రొయ్యలకు పట్టించడానికి: మొక్కజొన్న పిండి - 30 గ్రా., తెల్లసొన - 2 గుడ్లవి, ఉప్పు రుచికి తగినంత.
తయారుచేసే విధానం: రొయ్యల్ని ముందుగా పొట్టుతీసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రలో మొక్కజొన్నపిండి, గుడ్ల తెల్లసొన, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ జారులో రొయ్యల్ని ముంచి, నూనెలో 80 శాతం దాకా వేగించాలి. ఇపడు మరో పాత్రలో టేబుల్ స్పూను నూనె వేసి అల్లం, వెలుల్లి ముక్కల్ని వేగించి కూరగాయలు ఉడికించిన నీటిని కలపాలి. నీళ్లు మసులుతుండగా రొయ్యల్ని ఇందులో వేసి మిగతా 20 శాతం ఉడికించాలి. ఒక టేబుల్ స్పూను మొక్కజొన్నపిండి నీళ్లలో కలిపివేసి కాసేపుంచి దించేయాలి. ఇది అన్నంలోకి నంజుకోడానికి బాగుంటుంది..
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







