షార్జాలో బోటు ప్రమాదం.. ఆపరేటర్లకు పోలీసుల హెచ్చరికలు
- April 26, 2023
యూఏఈ: గత శుక్రవారం ఖోర్ ఫక్కన్ బీచ్లో భారతీయ ప్రవాసిని బలికొన్న సంఘటన తర్వాత షార్జా అధికారులు ఎమిరేట్లో పడవ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. టూరిస్ట్ బోట్ కంపెనీ నిర్లక్ష్యం కారణంగా ఒక ప్రవాస భారతీయుడు మరణించగా.. మరో నలుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. సదరు కంపెనీపై అభియోగాలు మోపబడి, పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు షార్జా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్, మేజర్-జనరల్ సైఫ్ అల్ జరీ అల్ షమ్సీ తెలిపారు. సంఘటన తరువాత అత్యవసర ప్రతిస్పందన బృందాన్ని సంఘటన స్థలానికి పంపినట్లు పేర్కొన్నారు. దర్యాప్తు అనంతరం ప్రమాదం జరిగిన సమయంలో బోట్ లో ఉన్న సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిర్దేశిత సంఖ్య కంటే అధికంగా పర్యాటకులను అనుమతించడమే ప్రమాదానికి కారణమని తమ విచారణలో తేలిందన్నారు. ప్రమాదం జరిగే సమయంలో బోట్లో మొత్తం 16 మంది వ్యక్తులు ఉన్నారని, డ్యూటీలో ఉన్న సిబ్బందితో సహా ఓడలో గరిష్టంగా 10 మందికి మాత్రమే అనుమతి ఉందని మేజర్-జనరల్ అల్ షమ్సీ తెలిపారు. బోట్ బోల్తా ఘటన అనంతరం ఎమిరేట్లోని ఇతర బోట్ ఆపరేటర్లందరికీ హెచ్చరిక జారీ చేయడంతోపాటు భద్రతా నియమాలకు అనుగుణంగా తనిఖీ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిబంధనలను పాటించని బోట్ లను సీజ్ చేసినట్లు.. చాలా ఆపరేటర్లు బోట్ సామర్థ్యాన్ని మించి పర్యాటకులను తీసుకెళ్తూ పట్టుబడ్డారని మేజర్-జనరల్ అల్ షమ్సీ వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!
- పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: కువైట్
- బహ్రెయిన్ లో హీట్ వేవ్స్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
- అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!
- సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- కీసర పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి సీపీ సుమతి









