ఖతార్ జనాభాలో 97 శాతం మంది సోషల్ మీడియా వినియోగదారులే..!
- April 26, 2023
దోహా: ఖతార్లో 2.62 మిలియన్ల మంది..మొత్తం జనాభాలో 96.8% యాక్టివ్ సోషల్ మీడియా వినియోగదారులు ఉన్నారు. ఈ మేరకు ఆన్లైన్ రిఫరెన్స్ లైబ్రరీ డేటా రిపోర్టల్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. జనవరి 2023లో ఖతార్లో 2.68 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంటర్నెట్ వ్యాప్తి రేటు 99 శాతంగా ఉంది. 2023 ప్రారంభంలో ఆఫ్లైన్లో ఉన్న 1% మంది.. మొత్తం జనాభాలో 27.1 వేల మంది ఉన్నారు. జనవరి 2023లో దేశంలోని మొత్తం ఇంటర్నెట్ యూజర్ బేస్లో 97.8 శాతం మంది కనీసం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ను ఉపయోగించారని డేటా రిపోర్టల్ పేర్కొంది.
ఖతార్లో నివసించే ప్రజలు ఎక్కువగా సందర్శించే ఆన్లైన్ సోషల్ ప్లాట్ఫారమ్లలో యూట్యూబ్ (2.62 మిలియన్ల వినియోగదారులు) తొలిస్థానంలో ఉండగా.. ఆ తర్వాత టిక్టాక్ (2.14 మిలియన్ల వినియోగదారులు), ఫేస్బుక్ (1.95 మిలియన్లు), ఇన్స్టాగ్రామ్ (1.40 మిలియన్లు), లింక్డ్ఇన్ (1.20 మిలియన్లు), ట్విట్టర్ (1.05 మిలియన్లు), మరియు స్నాప్చాట్ (975,000) ఉన్నాయి.
మరోవైపు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ప్రకటనల రీచ్ ఖతార్లో వృద్ధిని సాధించాయి. ముఖ్యంగా ఫేస్ బుక్, ఫేస్ బుక్ మెసెంజర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వినియోగదారుల సంఖ్యలో పెరుగుదల స్వల్పంగా తగ్గగా.. లింక్డ్ఇన్, ట్విట్టర్, టిక్టాక్ లలో పెరుగుదల నమోదైంది. 2023 ప్రారంభంలో ఖతార్లో 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దవారిలో 96.5% మందికి షార్ట్ వీడియో ప్లాట్ఫారమ్ ప్రకటనలు చేరుకున్నాయని టిక్టాక్ను నిర్వహిస్తున్న ఇంటర్నెట్ టెక్నాలజీ కంపెనీ బైట్డాన్స్ ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి పన్నెండు నెలల్లో ఖతార్లో ఇంటర్నెట్ వేగం కూడా పెరిగిందని నివేదిక తెలిపింది. మీడియా మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ కోసం 78.08 Mbps పెరుగుదల (79.6% పైగా) నమోదైంది. అదే సమయంలో ఖతార్లో స్థిర ఇంటర్నెట్ కనెక్షన్ వేగం కూడా 26.70 Mbps (41.6% పైగా) పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగం పెరుగుతోందని నివేదిక వివరించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!
- పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: కువైట్
- బహ్రెయిన్ లో హీట్ వేవ్స్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
- అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!
- సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- కీసర పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి సీపీ సుమతి









